హైదరాబాద్ : ప్రస్తుతం వ్యవసాయంలో రసాయన మందుల వాడకం ఎక్కువయిపోయింది. దీంతో మళ్లీ పాతకాలంలో యాదిరిగా ఆర్గానిక్ పద్ధతిలో పండించే పంటలను డిమాండ్ పెరిగింది. ఇందుకోసం భూమిలోని పెస్టిసైడ్స్న తొలగించే పద్దతిని (TG) తెలంగాణ శాస్త్రవేత్తలు కనిపెట్టారు. హైదరాబాద్లోని ఉస్మానియా విశ్వవిద్యాలయం (Osmania University) మైక్రోబయాలజీ కవిభాగానికి చెందిన శాస్త్రవేత్తలు వ్యవసాయంలో రసాయన ఎరువుల ఎఫెక్ట్ ను తొలగించే పరిష్కారాన్ని కనుగొన్నారు. వంటల కోసం ఉపయోగించే రసాయన ఎరువులను మట్టిలోంచి తొలగించే సరికొత్త ప్రయోగాన్ని విజయవంతం గా జరిపారు.
Read Also: TGPSC: ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్మెంట్ పూర్తి: ఛైర్మన్

రైతులకు ఉపయోగకరమైన సరికొత్త సాంకేతికత
కేవలం మూడు వారాల్లో 90 శాతం వరకు భూమిలోని పెస్టిసైడ్స్ తొలగించే మైక్రోబియల్ ప్రక్రియను అభివృద్ధి చేశారు. (TG) ఈ పరిశోధనను ప్రొఫెనర్ బుర్గుల సందీప్త నేతృత్వంలో మూడు సంవత్సరాలపాటు నిర్వహించారు. ఈ అధ్యయనంలో శాస్త్రవేత్తలు అధికం గా పురుగుమందులు వినియోగించే వ్యవసాయ భూముల నుండి 12 రకాల సూక్ష్మజీవులను గుర్తించారు. వీటిలో ఐదు రకాలను ఎంపిక చేసి వాటివల్ల విషపూరిత రసాయనాల తొలగింప సామర్థ్యాన్ని పరిశీలించారు. ప్రయోగాల కోసం రెడ్, బ్లాక్ మట్టిలో నాలుగు నుంచి ఐదు రెట్ల అధికంగా కలిగిన పెస్టిసైడ్ స్థాయిని ఉపయోగించారు. ఈ సూక్ష్మజీవులను సహజ వెలుతురు, గాలి పరిస్థితుల్లో ప్రయోగించగా. కేవలం మూడు వారాల్లో మట్టిలోని పెస్టిసైడ్ మిగులు 75 నుండి 90 శాతం వరకూ తగ్గినట్ల ఫలితాలు చూపించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: