Vizag crime: విశాఖపట్నం నగరంలోని పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం అర్ధరాత్రి దారుణ ఘటన జరిగింది. మేహాద్రి గడ్డ–కొత్తపాలెం రహదారి పక్కన ఓ యువకుడి మృతదేహం లభ్యమైంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు.
Read also: Tirupati: చింతలచేను చిన్నారి కిడ్నాప్ కేసు ఛేదన.. ఆరుగురు అరెస్ట్

టాటూ ఆధారంగా మృతుడి గుర్తింపు
మృతుడి చేతిపై ఉన్న టాటూ(Tattoo Identification)ను ఆధారంగా అతడిని పెందుర్తి అప్పలనర్సయ్య కాలనీకి చెందిన గుంటూరు కళ్యాణ్ చక్రవర్తిగా గుర్తించారు. ఈ హత్య కేసులో కీలకంగా భావిస్తున్న మనోజ్ కుమార్, వినోద్ కుమార్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ప్రాథమిక విచారణలో కళ్యాణ్తో కలిసి నిందితులు ఆదివారం పార్టీ చేసుకున్నట్లు వెల్లడైంది. పాత విరోధాలే ఈ హత్యకు కారణమని పోలీసులు నిర్ధారించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా వెలుగులోకి రావాల్సి ఉంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: