Konaseema blowout: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని మలికిపురం మండలం ఇరుసుమండలో ఇటీవల చోటుచేసుకున్న బ్లోఅవుట్ ఘటన నేపథ్యంలో బాధితులకు ఓఎన్జీసీ కీలక ప్రకటన చేసింది. ఈ ఘటనతో ప్రభావితమైన కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ఓఎన్జీసీ ముందుకొచ్చింది. ఇరుసుమండ, గుబ్బలపాలెం, లక్కవరం, చింతలపల్లి గ్రామాలకు చెందిన మొత్తం 6,300 కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి రూ.10,000 చొప్పున ఆర్థికసాయం అందించనున్నట్లు ఓఎన్జీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శాంతందాస్ వెల్లడించారు. ఈ సహాయం ఫిబ్రవరి నెల మొదటి వారంలోనే పంపిణీ చేయనున్నట్లు ఆయన తెలిపారు.
Read Also: Rayalaseema groundnut prices: రికార్డు స్థాయికి చేరుకున్న వేరుశనగ ధర
బ్లోఅవుట్ ఘటన కారణంగా ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రజలకు తక్షణమే ఉపశమనం కలిగించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఓఎన్జీసీ స్పష్టం చేసింది. అలాగే ఈ ఘటనలో పంటలు నష్టపోయిన రైతులను కూడా గుర్తించి, వారికి ప్రత్యేకంగా ఆర్థికసాయం అందించనున్నట్లు ప్రకటించింది. నష్టపరిహారం పంపిణీ ప్రక్రియను స్థానిక అధికారుల సమన్వయంతో వేగంగా పూర్తి చేయనున్నట్లు పేర్కొంది.

ప్రాంత ప్రజల భద్రత, జీవనోపాధి పరిరక్షణకు ఓఎన్జీసీ కట్టుబడి ఉందని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చారు. ఈ ఆర్థిక సహాయం వల్ల బ్లోఅవుట్ ప్రభావంతో ఇబ్బంది పడుతున్న కుటుంబాలకు కొంతమేర ఉపశమనం కలుగుతుందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: