हिन्दी | Epaper

Iran: ట్రంప్ వ్యాఖ్యలపై భారత్​లోని ఇరాన్ ప్రతినిధి స్పందన

Vanipushpa
Iran: ట్రంప్ వ్యాఖ్యలపై భారత్​లోని ఇరాన్ ప్రతినిధి స్పందన

ఇరాన్​ను నాశనం చేస్తానని ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్​ చేసిన వ్యాఖ్యలపై ఆ దేశ ప్రతినిధి డాక్టర్ అబ్దుల్ మజీద్ హాకీం ఇలాహీ మండిపడ్డారు. ట్రంప్ వ్యాఖ్యలు కొత్తవి కాదని, అయినా దేనికైనా తాము సిద్ధంగా ఉన్నట్లు భారత్​లో ఉన్న ఆయన వెల్లడించారు. ఈ మేరకు ఓ వార్తసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు వ్యాఖ్యలు చేశారు. తనపై హత్యకు పాల్పడితే ఇరాన్​ను అమెరికా నాశనం చేస్తుందని ఇటీవల ట్రంప్ వ్యాఖ్యానించారు.

Read Also: Breaking News: అమెరికాలో నలుగురు భారత సంతతి వ్యక్తుల హత్య

Iran: ట్రంప్ వ్యాఖ్యలపై భారత్​లోని ఇరాన్ ప్రతినిధి స్పందన
Iran: ట్రంప్ వ్యాఖ్యలపై భారత్​లోని ఇరాన్ ప్రతినిధి స్పందన

‘అంతర్జాతీయ ఇంటర్నెట్‌ను తాత్కాలికంగా నిలిపేశాం

మేం శాంతి, భద్రత కోరుకుంటున్నాం. కానీ కొందరు ఈ పరిస్థితిని సృష్టించారు. దీని వల్ల మొత్తం పశ్చిమాసియా నాశనం అవుతోంది. అన్ని దేశాలు ప్రభావితమవుతాయి. ఇరాన్ శత్రువులు బయట నుంచి యువతను రెచ్చగొడుతున్నారు. అందుకే అంతర్జాతీయ ఇంటర్నెట్‌ను తాత్కాలికంగా నిలిపేశాం. స్థానిక ఇంటర్నెట్ మాత్రం పనిచేస్తోంది. సోషల్ మీడియాను పూర్తిగా నియంత్రించడం చాలా కష్టం. ఇరాన్‌(Iran)కు అనేక శత్రువులు ఉన్నారు. 250కి పైగా ఛానళ్లు 24 గంటలూ ఇరాన్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నాయి’ అని డాక్టర్ అబ్దుల్ మజీద్ తెలిపారు.

అంతర్జాతీయ సంస్థలు ప్రపంచంలో తమ ప్రభావాన్ని కోల్పోయాయి

ఐక్యరాజ్య సమితి అత్యవసర సమావేశంపై డాక్టర్ అబ్దుల్ మజీద్ స్పందించారు. కొన్ని అంతర్జాతీయ సంస్థలు ప్రపంచంలో తమ ప్రభావాన్ని కోల్పోయాని తెలిపారు. మరికొన్ని సంస్థలు కొన్ని దేశాల చేతుల్లోనే ఉన్నాయని చెప్పారు. అవి తమ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించి, ప్రజలు, దేశాల ప్రయోజనాల కోసం పనిచేస్తాయని తాము అశిస్తున్నామని అన్నారు. ఇరాన్​ పరిస్థితులపై ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలి జనవరి 23న ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించింది.
Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

మొజ్తాబా ఖమేనీ ఆరోగ్యంపై డొనాల్డ్ ట్రంప్ క్లారిటీ

మొజ్తాబా ఖమేనీ ఆరోగ్యంపై డొనాల్డ్ ట్రంప్ క్లారిటీ

మేము కేవలం గర్భాలం కాదు: జపాన్ మహిళల ‘స్టెరిలైజేషన్’ పోరాటం

మేము కేవలం గర్భాలం కాదు: జపాన్ మహిళల ‘స్టెరిలైజేషన్’ పోరాటం

చైనా పెట్టుబడులకు భారత్ పచ్చజెండా

చైనా పెట్టుబడులకు భారత్ పచ్చజెండా

ఇరాన్ కు ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్: పశ్చిమాసియాలో భీకర యుద్ధం

ఇరాన్ కు ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్: పశ్చిమాసియాలో భీకర యుద్ధం

100 డాలర్ల దిగువకు చేరిన బ్యారెల్!.. రష్యా ఆయిల్‌పై అమెరికా కీలక నిర్ణయం!

100 డాలర్ల దిగువకు చేరిన బ్యారెల్!.. రష్యా ఆయిల్‌పై అమెరికా కీలక నిర్ణయం!

మోజ్తాబా ఖమేనీకి జీవిత బీమా లేదు: నెతన్యాహు

మోజ్తాబా ఖమేనీకి జీవిత బీమా లేదు: నెతన్యాహు

ఇరాన్ యుద్ధంతో పనామా కాలువకు పెరిగిన ట్రాఫిక్‌

ఇరాన్ యుద్ధంతో పనామా కాలువకు పెరిగిన ట్రాఫిక్‌

అబ్రహాం లింకన్ యుద్ధనౌకపై దాడి! ఇరాన్ వాదనలను కొట్టిపారేసిన అమెరికా

అబ్రహాం లింకన్ యుద్ధనౌకపై దాడి! ఇరాన్ వాదనలను కొట్టిపారేసిన అమెరికా

7 రూపాయల నుంచి 4 రూపాయలకు పడిపోయిన గుడ్డు ధరలు

7 రూపాయల నుంచి 4 రూపాయలకు పడిపోయిన గుడ్డు ధరలు

అడోబ్ సీఈవో శాంతను నారాయణ్ ఎందుకని తప్పుకున్నారు?

అడోబ్ సీఈవో శాంతను నారాయణ్ ఎందుకని తప్పుకున్నారు?

రూ.320 దాటిన పెట్రోల్.. ఆర్థిక సంక్షోభం తీవ్రం!

రూ.320 దాటిన పెట్రోల్.. ఆర్థిక సంక్షోభం తీవ్రం!

పెరిగిన వంట నూనె ధరలు

పెరిగిన వంట నూనె ధరలు

📢 For Advertisement Booking: 98481 12870