ప్రస్తుత తాత్కాలిక ప్రభుత్వ సారథి ముహమ్మద్ యూనస్పై బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) నిప్పులు చెరిగారు. అతనొక ఫాసిస్ట్, అవినీతిపరుడైన దేశద్రోహి, హంతకుడని విమర్శించారు. తన స్వార్థం కోసం యూనస్ దేశాన్ని రక్తమోడించాడని అన్నారు. ప్రస్తుతం బంగ్లాదేశ్ ఒక భయానక అగాధంలో ఉందని, సామాన్య ప్రజల ప్రాణాలకు రక్షణ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఫారిన్ కరస్పాండెంట్స్ క్లబ్ ఆఫ్ సౌత్ ఆసియా నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ షేక్ తన ఆడియో సందేశం ఇచ్చారు. ప్రస్తుతం భారతదేశంలో ఆశ్రయం పొందుతున్న ఆమె, బంగ్లాదేశ్ దుస్థితిని వివరిస్తూ యూనస్పై విమర్శల వర్షం కురిపించారు.
Read Also: America: “అవును నేను నియంతనే”: డొనాల్డ్ ట్రంప్

అవినీతిపరుడైన దేశద్రోహి యూనస్: షేక్ హసీనా
“ప్రస్తుతం ఎక్కడ విన్నా విధ్వంసం మధ్య బతకడానికి పోరాడుతున్న ప్రజల ఆక్రందనలే వినిపిస్తున్నాయి. అవి ప్రాణాల కోసం చేస్తున్న నిస్సహాయ అభ్యర్థనలు. ఉపశమనం కోసం గుండెలు పగిలేలా వేస్తున్న కేకలు. హంతక ఫాసిస్ట్, మనీ లాండరర్, దోపిడీదారుడు, అవినీతిపరుడైన దేశద్రోహి యూనస్. అతను తన స్వార్థపూరిత పోకడలతో దేశాన్ని రక్తమోడించాడు. మన మాతృభూమి (బంగ్లాదేశ్) ఆత్మకు మచ్చ తెచ్చాడు.” అని షేక్ హసీనా ఆవేదన వ్యక్తం చేశారు.
భయం నీడలో ప్రజలు
‘ప్రస్తుతం బంగ్లాదేశ్లో తీవ్రమైన అరాచకత్వం, అభద్రత రాజ్యమేలుతున్నాయి. మైనారిటీలు తీవ్ర వేధింపులు ఎదుర్కొంటున్నారు. దేశవ్యాప్తంగా మూక దాడులు, లూటీలు, తీవ్రవాదం వ్యాపిస్తున్నాయి. ప్రభుత్వ వ్యవస్థలు అన్నీ బలహీనపడ్డాయి. న్యాయం కరువైంది. జాతీయ ప్రయోజనాలను తుంగలో తొక్కుతున్నారు. సామాన్య ప్రజల దైనందిన జీవితం భయం నీడలో కొనసాగుతోంది’ అని హసీనా పేర్కొన్నారు. “ఈ సంక్షోభ సమయంలో రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి, ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడానికి, దేశ సార్వభౌమత్వాన్ని రక్షించుకోవడానికి అందరూ ఏకం క కావాల్సిన అవసరం ఉంది అని షేక్ హసీనా అన్నారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: