ఆంధ్రప్రదేశ్లోని మన్యం జిల్లాలో శుక్రవారం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. జియమ్మవలస గ్రామంలో నివసిస్తున్న ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులు విషం తాగి ఆత్మహత్యకు (suiside) పాల్పడిన ఘటన కలకలం రేపింది. ఈ సంఘటనతో గ్రామమంతా శోకసంద్రంలో మునిగిపోయింది. ఒక్కసారిగా జరిగిన ఈ విషాద ఘటన స్థానిక ప్రజలను తీవ్రంగా కలచివేసింది. విషయం తెలుసుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
Read also: UP crime: పరువు హత్య తో ప్రేమికులని చంపిన సోదరులు

Three members of the same family died after consuming poison
భర్త, భార్య, కుమారుడు మృతి – ఆస్పత్రిలో కుమార్తె
ఈ విషాద ఘటనలో భర్త, భార్య, కుమారుడు విషం తాగి ప్రాణాలు కోల్పోయారు. అదే కుటుంబానికి చెందిన కుమార్తెను అపస్మారక స్థితిలో ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కుటుంబ సభ్యుల మృతితో ఆస్పత్రి వద్ద హృదయ విదారక దృశ్యాలు కనిపించాయి. పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.
దంపతుల మధ్య గొడవలే కారణమని గ్రామస్థుల అనుమానం
గ్రామస్థుల కథనం ప్రకారం, దంపతుల మధ్య తరచూ జరుగుతున్న కుటుంబ కలహాలే ఈ దారుణ ఘటనకు కారణమై ఉండొచ్చని భావిస్తున్నారు. అయితే, దీనిపై ఇప్పటివరకు అధికారికంగా నిర్ధారణ కాలేదు. పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేపట్టారు. కుటుంబ సమస్యలతో ఈ నిర్ణయం తీసుకున్నారా? లేక మరేదైనా కారణం ఉందా? అన్న విషయాలపై దర్యాప్తు కొనసాగుతోంది. పూర్తి వివరాలు దర్యాప్తు అనంతరం వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: