శ్రీకాళహస్తి : భారత దేశంలోని పంచభూత లింగాల్లో వాయు లింగేశ్వరుడు స్వయంభువుగా వెలసిన దివ్య క్షేత్రంలో నిర్వహించే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను భక్తుల మనోభావాలకు అనుగుణంగా నిర్వహించాలని తిరుపతిజిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వరన్ సూచించారు. వచ్చేనెల 10 నుంచి ప్రారంభమయ్యే మహాశిశివరాత్రి బ్రహ్మోత్సవాల సమీక్షా సమావేశం బ్రహ్మగుడి ఆవరణలో ఏర్పాటు చేసారు. ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్తో పాటు జిల్లా ఎస్పి సుబ్బరాయుడు, ఎఎస్పి రమనోహరాచారి, ఆలయ కార్యనిర్వ హాణాధికారి డి. బాపి రెడ్డి, ధర్మకర్తల మండలి చైర్మెన్ కొట్టెసాయి ప్రసాద్లు హాజరయ్యారు.
Read also: education: విద్యను ప్రైవేట్ పరం చేయడం న్యాయమా?

It should resonate with the chanting of Lord Shiva’s name
అందరు కలసి కట్టుగా పని చేస్తేనే సాధ్యo
ఈ సందర్భంగా కలెక్టర్ వెంకటేశ్వరన్ మాట్లాడుతూ బ్రహ్మోత్సవాల్లో ప్రధానంగా మహాశివరాత్రి పర్వదినాన సామాన్యభక్తులకు సుదర్శనం కల్పించాలన్నారు. అందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. అందుకుతగ్గట్టు క్యూలైన్లను ఏర్పాటు చేసుకోవాలని ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు. గత ఏడాది శాఖల మధ్య సమన్వయంతో బ్రహ్మోత్సవాలు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా విజయవంతం చేసారు. అందుకు అభినందించారు. పట్టణమంతా ‘శివనామస్మరణతో మారుమోగాలి’ అని కలెక్టర్ సూచించారు.
ఉత్సవాల రోజులు ప్లేక్సీల సంప్రదాయానికి స్వస్తి చెప్పటానికి అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ఇక బాల్యవివాహాలను జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. మంచి వాతావరణంలో బ్రహ్మోత్సవాలు నిర్వహించేలా పటిష్ట బందోబస్తును రూపకల్పన చేసుకొని ఆచరించాలని ఎసిపి సుబ్బరాయుడు సూచించారు. ఏ ఉత్సవాలైనా విజయవంతం కావాలంటే ఒక్కశాఖ పనిని చేస్తే సరిపోదని అందరు కలసి కట్టుగా పని చేస్తేనే సాధ్యమౌతుందన్నారు. దేవస్థానం తరఫున వివిధ శాఖలకు కావాల్సిన ఏర్పాట్లు చేస్తామన్నారు. అధికారులు సమన్వయంతో పని చేస్తే ప్రభుత్వానికి మంచిపేరు వస్తుందని చైర్మెన్ కొట్టెసాయి ప్రసాద్ అన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: