हिन्दी | Epaper

TG: ఫోన్ ట్యాపింగ్ కేసు.. SIT విచారణకు హాజరైన KTR

Anusha
TG: ఫోన్ ట్యాపింగ్ కేసు.. SIT విచారణకు హాజరైన KTR

తెలంగాణ (TG)లో సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసు (Phone Tapping Case) రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా ఈ కేసుకు సంబంధించి సిట్ విచారణకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈరోజు హాజరయ్యారు. ఈరోజు విచారణకు రావాలంటూ కేటీఆర్ కు నిన్న సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ క్రమంలోనే ఆయన విచారణకు హాజరయ్యారు.

Read Also: Telangana: మద్యం ప్రియులకు షాక్

TG: Phone tapping case..KTR attends SIT inquiry
TG: Phone tapping case..KTR attends SIT inquiry

సజ్జనార్ నేతృత్వంలోని సిట్ బృందం ఈ కేసును దర్యాప్తు చేస్తోంది

ఇదే కేసులో మాజీ మంత్రి హరీశ్ రావును సిట్ అధికారులు ఇటీవల విచారించారు. ఇప్పుడు కేటీఆర్ ను విచారణకు పిలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి 2024 మార్చిలో పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయింది. ప్రస్తుతం హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ నేతృత్వంలోని సిట్ బృందం ఈ కేసును దర్యాప్తు చేస్తోంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870