విజయవాడ : ఆస్ట్రేలియా తరహాలో 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆలోచిస్తోందని ఎపి మానవవనరుల శాఖా మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఈ విషయాన్ని దావోస్ లో ఎపి మంత్రి నారా లోకేష్ (Nara lokesh) వెల్లడించారని ఓ వెబ్సైట్ ప్రస్తావించింది. పిల్లల భద్రత దృష్ట్యా కఠిన చట్టాలు తీసుకురావాలని భావిస్తున్నట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా ఈ తరహా ఆంక్షలపై కేంద్రం ఇంకా స్పష్టత ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలు చట్టపరమైన, సాంకేతిక సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది.
Read also: chandrababu naidu : దావోస్ టూర్ ముగిసింది, చంద్రబాబు వెంటనే ఏం చేయబోతున్నారు?

Ban on minors on social media
ఆస్ట్రేలియా ప్రభుత్వం 16 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా వాడకుండా నిషేధం విధించింది. ఈ చట్టం ఇప్పటికే అమల్లోకి రావడంతో.. భారత్లో కూడా అమలు చేస్తే బావుంటుందనే వాదన తెరపైకి వచ్చింది. తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆస్ట్రేలియా తరహాలోనే 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను బ్యాన్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు చర్చ జరుగుతోంది. దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సదస్సులో.. ఎపి ఐటీ, విద్యాశాఖ మంత్రి ఈ విషయాన్ని తమతో చెప్పినట్లుగా లోకేష్ బ్లూమ్ బర్గ్ అనే న్యూస్ వెబ్సైట్తో పాటే మరికొన్ని వార్తాసంస్థలు వెల్లడించాయి.
కేంద్రం నిర్ణయం లేకపోవడంతో రాష్ట్రాల ముందడుగు
ఆస్ట్రేలియాలో ఉన్న అండర్16 చట్టాన్ని మేము అధ్యయనం చేస్తున్నాము. అవును మేము ఒక బలమైన చట్టాన్ని తీసుకురావాలని నమ్ముతున్నాము అని నారా లోకేష్ దావోస్ లో జరిగిన ప్రపంచ ఎకనామిక్ ఫోరమ్లో వారితో చెప్పినట్లుగా బ్లూమ్ బర్గ్ తెలిపింది. కొంత వయస్సు (టీనేజర్లు) లోపు పిల్లలు సోషల్ మీడియాలో ఉండకూడదని నేను గట్టిగా భావిస్తున్నాను. వారు ఏమి చూస్తున్నారో వారికి అర్థం కాదు. భారతదేశంలో ఇప్పటికే మైనర్లు సోషల్ మీడియాను యాక్సెస్ చేయడానికి తల్లిదండ్రుల నుంచి నియంత్రణ ఉంది. అయితే ఈ విషయంలో విస్తృతమైన ఆంక్షలపై కేంద్రం ఇంకా ఎలాంటి అభిప్రాయాన్ని వ్యకం చేయలేదు అన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: