ఈ నెల 28 నుంచి ప్రారంభం కానున్న మేడారం(Medaram) మహాజాతరను సాఫీగా నిర్వహించేందుకు అధికారులు ట్రాఫిక్ ప్లాన్ను సిద్ధం చేశారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివచ్చే నేపథ్యంలో, వాహనాల రద్దీని నియంత్రించేందుకు ప్రత్యేక మార్గాలను ఖరారు చేశారు.
Read Also: Telangana: మేడారం జాతరలో వాట్సాప్ సర్వీసులు

భక్తుల రాకపోకలకు ప్రత్యేక మార్గాల కేటాయింపు
ఖమ్మం, నల్గొండ, హైదరాబాద్, మెదక్, వరంగల్ వైపు నుంచి వచ్చే భక్తులు ములుగు, పస్రా మార్గాల ద్వారా మేడారం(Medaram) సమీపంలోని ఊరట్టం స్తూపం వరకు చేరుకోవాలని సూచించారు. అదేవిధంగా ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలు కాటారం, కాల్వపల్లి మార్గాన్ని ఉపయోగించి మేడారం వైపు వెళ్లాల్సి ఉంటుంది.
మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్తో పాటు భద్రాద్రి కొత్తగూడెం వైపు నుంచి వచ్చే భక్తులు ఏటూరునాగారం, కొండాయి మార్గాల మీదుగా మేడారం చేరుకోవాలని అధికారులు తెలిపారు. భక్తులు నిర్దేశిత మార్గాలను అనుసరించి సహకరించాలని, ట్రాఫిక్ నియంత్రణ చర్యలకు సహకారం అందించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: