భారత స్టాక్ మార్కెట్లు గురువారం లాభాలతో ముగిశాయి, మూడు రోజుల నష్టాలకు బ్రేక్ పడింది. సెన్సెక్స్ 397.74 పాయింట్లు పెరిగి 82,307.37 వద్ద స్థిరపడగా, నిఫ్టీ 132.4 పాయింట్ల లాభంతో 25,289.9 వద్ద ముగిసింది. అంతర్జాతీయ సానుకూల పరిణామాలు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల తగ్గుదల ఇన్వెస్టర్లలో ఆత్మవిశ్వాసాన్ని పెంచాయి. పీఎస్యూ బ్యాంక్, మీడియా రంగాల షేర్లలో కొనుగోళ్లు ఎక్కువగా కనిపించాయి.
Read also: RBI: నకిలీ నోట్లపై అలర్ట్.. అసలు, నకిలీ తేడాలు తెలుసుకోండి

stock markets closed with gains
సెన్సెక్స్, నిఫ్టీ లాభాలతో ముగింపు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald trump) ఫిబ్రవరి 1 నుంచి యూరోపియన్ యూనియన్ దేశాలపై టారిఫ్లు విధించనున్నట్లు ప్రకటించడం మార్కెట్లకు మిక్స్ రియాక్షన్ ఇచ్చింది. అదనంగా, గ్రీన్లాండ్పై నాటోతో భవిష్యత్ ఒప్పందానికి ఫ్రేమ్వర్క్ కుదిరిన సంగతి, భారత్తో పెద్ద వాణిజ్య ఒప్పందం వచ్చే అవకాశం, మార్కెట్ సెంటిమెంట్ను బలపరిచాయి.
అంతర్జాతీయ సానుకూల పరిణామాలు
బీఎస్ఈలో అదానీ పోర్ట్స్, బీఈఎల్, ఎస్బీఐ, టాటా స్టీల్ వంటి హెవీవెయిట్ షేర్లలో కొనుగోళ్లు అయ్యాయి. అయితే, ఇటర్నల్, టైటాన్, మారుతీ సుజుకీ, నష్టంతో ముగిశాయి. రంగాల వారీగా చూసినప్పుడు, నిఫ్టీ రియల్టీ, కన్జూమర్ డ్యూరబుల్స్ మినహా అన్ని రంగాలు లాభాలతో ముగిశాయి.
మార్కెట్ నిపుణుల ప్రకారం, నిఫ్టీ 25,120 స్థాయికి పైన నిలిచితే, 25,400–25,500 వైపు స్థిరమైన పెరుగుదల ఉండే అవకాశం ఉంది. కానీ, 25,120 స్థాయిని కోల్పోతే అమ్మకాల ఒత్తిడి పెరిగి 25,100 దిశగా పడిపోవచ్చని హెచ్చరిస్తున్నారు. మిడ్క్యాప్, స్మాల్క్యాప్ ఇండెక్స్లలో కూడా లాభాల ధోరణి కొనసాగింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: