हिन्दी | Epaper

Siddaramaiah: గ‌వ‌ర్న‌ర్ గెహ్లాట్ రాజ్యాంగాన్ని ఉల్లంఘించారు : క‌ర్నాట‌క సీఎం

Sudha
Siddaramaiah: గ‌వ‌ర్న‌ర్ గెహ్లాట్ రాజ్యాంగాన్ని ఉల్లంఘించారు : క‌ర్నాట‌క సీఎం

క‌ర్నాట‌క అసెంబ్లీలో ఇవాళ గంద‌ర‌గోళం నెల‌కొన్న‌ది. గ‌వ‌ర్న‌ర్ థావ‌ర్‌చాంద్ గెహ్లాట్ కేవ‌లం రెండు లైన్ల ప్ర‌సంగాన్ని మాత్ర‌మే చ‌దివి వినిపించారు. దీంతో కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఆయ‌న‌పై విమ‌ర్శ‌లు చేసింది. కేవ‌లం ప్రారంభ పంక్తులు మాత్ర‌మే చ‌ద‌వి గెహ్లాట్ త‌న ప్ర‌సంగాన్ని ముగించేశారు. ఆర్థికంగా, సామాజిక అభివృద్ధి ప‌రిచేందుకు త‌న రాష్ట్రం క‌ట్టుబ‌డి ఉంద‌ని, జై హింద్‌.. జై క‌ర్నాట‌క అని ఆయ‌న హిందీలో ప్ర‌సంగాన్ని చ‌దివి వినిపించారు. గ‌వ‌ర్న‌ర్ థావ‌ర్‌చాంద్ త‌న ప్ర‌సంగాన్ని అర్ధాంత‌రంగా ముగించ‌డంతో కాంగ్రెస్ స‌భ్యులు విస్మ‌యం వ్య‌క్తం చేశారు.

Read Also: SCR: తెలుగు రాష్ట్రాలకు గుడ్ న్యూస్ చెప్పిన రైల్వేశాఖ

Siddaramaiah
Siddaramaiah

షేమ్ షేమ్ అని కాంగ్రెస్ స‌భ్యులు నినాదాలు చేశారు. రాజ్యాంగాన్ని గ‌వ‌ర్న‌ర్ గెహ్లాట్ ఉల్లంఘించార‌ని సీఎం సిద్ధ‌రామ‌య్య (Siddaramaiah)అన్నారు. ప్ర‌భుత్వం రాసిచ్చిన పూర్తి ప్ర‌సంగాన్ని ఆయ‌న చ‌ద‌వలేద‌ని ఆరోపించారు. కేంద్ర ప్ర‌భుత్వానికి కీలుబొమ్మ‌గా గ‌వ‌ర్న‌ర్ గెహ్లాట్ మారిన‌ట్లు పేర్కొన్నారు. గ‌వ‌ర్న‌ర్ ప్ర‌వ‌ర్త‌న ప‌ట్ల సుప్రీంకోర్టును ఆశ్ర‌యించే ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లు సీఎం సిద్ధ‌రామ‌య్య (Siddaramaiah)తెలిపారు. క‌ర్నాట‌క స‌ర్కారు రూపొందించిన‌ ప్ర‌సంగంలోని 11 పేరాల‌పై గ‌వర్న‌ర్ థావ‌ర్‌చాంద్ అభ్యంత‌రాలు వ్య‌క్తం చేశారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870