Modi biopic Maa Vande : భారత ప్రధాని Narendra Modi జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న భారీ బయోపిక్ మా వందే దేశవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని సిల్వర్ కాస్ట్ క్రియేషన్స్ బ్యానర్పై నిర్మాత M. Veer Reddy నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో మోదీ పాత్రలో మలయాళ స్టార్ Unni Mukundan నటిస్తున్నారు.
కథ వినగానే ఈ ప్రాజెక్ట్పై నమ్మకం కలిగి రవీనా టాండన్, జగపతి బాబు, శరత్ కుమార్ వంటి ప్రముఖ నటులు వెంటనే ఒప్పుకున్నారని చిత్రబృందం తెలిపింది. ‘మా వందే’ను రూ.400 కోట్లకు పైగా భారీ బడ్జెట్తో, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో రూపొందిస్తున్నారు. ఇండియన్ సినిమా చరిత్రలో తొలిసారిగా ARRI Alexa 265 కెమెరాను Cooke లెన్స్లతో ఉపయోగించి చిత్రీకరణ చేయడం విశేషంగా నిలుస్తోంది.
Read Also: Movies: OTTలోకి కొత్త సినిమాలు
ఈ చిత్రానికి దర్శకుడు C. H. Kranti Kumar దర్శకత్వం (Modi biopic Maa Vande) వహిస్తున్నారు. మోదీ జీవితంలోని నిజ సంఘటనలను ఆధారంగా తీసుకుని, ఆయన బాల్యం నుంచి రాజకీయ ప్రస్థానం వరకూ ఈ సినిమాలో చూపించనున్నారు. ముఖ్యంగా “తల్లి ధైర్యం అన్ని కష్టాలకు మించినది” అనే భావనను కథకు ప్రధాన బలంగా మలిచారు.

ఈ సినిమాలో భారీ వీఎఫ్ఎక్స్ వర్క్తో పాటు అంతర్జాతీయ సాంకేతిక నిపుణులు పని చేస్తున్నారు. హాలీవుడ్ నటుడు Jason Momoa ను ఒక కీలక పాత్ర కోసం సంప్రదించినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. స్టంట్ మాస్టర్ కింగ్ సోలమన్, ఆర్ట్ డైరెక్టర్ సాబు సిరిల్, ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్, సినిమాటోగ్రాఫర్ కె.కే. సెంథిల్ కుమార్, సంగీత దర్శకుడు రవి బస్రూర్ వంటి టాప్ టెక్నీషియన్లు ఈ ప్రాజెక్ట్లో భాగమవడం సినిమాపై అంచనాలను పెంచుతోంది.
దాదాపు మూడు సంవత్సరాల పాటు ప్రీ-ప్రొడక్షన్ చేసిన ఈ సినిమా తొలి షెడ్యూల్ ఇప్పటికే పూర్తైంది. జనవరి 22 నుంచి కాశ్మీర్లో రెండో షెడ్యూల్ ప్రారంభం కానుంది. ‘మా వందే’ను పాన్ ఇండియా స్థాయిలో అన్ని భాషల్లోనే కాకుండా, ఇంగ్లీష్ వెర్షన్లో కూడా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: