మహిళల ప్రీమియర్ లీగ్లో మరో కీలక మ్యాచ్కు రంగం సిద్ధమైంది. ఈ టోర్నీలో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ జట్లు తలపడనున్నాయి.ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఢిల్లీ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. ముంబై ఇండియన్స్ ఇప్పటివరకు ఆడిన 5 మ్యాచ్లలో 2 విజయాలు సాధించగా, ఢిల్లీ క్యాపిటల్స్ 4 మ్యాచ్లలో ఒకే ఒక్క విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచ్లో ఇరు జట్లు గెలుపు కోసం తీవ్రంగా పోరాడనున్నాయి.ఒకేఒక విజయంతో అట్టడుగున నిలిచిన ఢిల్లీ క్యాపిటల్స్కు కచ్చితంగా గెలిస్తేనే రేసులో ఉంటుంది.
Read Also: Viral Video: గంభీర్పై స్టేడియంలో డౌన్ డౌన్ నినాదాలు.. కోహ్లీ షాక్
కాబట్టి.. జెమీమా రోడ్రిగ్స్ బృందం సర్వశక్తులు ఒడ్డేందుకు సిద్ధమవుతోంది. ముంబై జట్టు ఓపెనర్ జి.కమలిని, సేవల్ని కోల్పోనుంది. గాయం కారణంగా ఈ యువ ఓపెనర్ డబ్ల్యూపీఎల్ నుంచి వైదొలిగింది. ఆమె స్థానంలో స్పిన్ సంచలనం వైష్ణవీ శర్మ స్క్వాడ్లోకి వచ్చింది. ఢిల్లీతరఫున 16 ఏళ్ల దీయా యాదవ్ ఈ మ్యాచ్తో డబ్ల్యూపీఎల్లో అరంగేట్రం చేస్తోంది. మంబై ఇండియన్స్ వికెట్ కీపర్గా రహిలా ఫిర్దౌస్ జట్టులోకి రాగా.. వైష్ణవీ డెబ్యూట్ క్యాప్ అందుకుంది.

ముంబై ఇండియన్స్ తుది జట్టు: హీలీ మాథ్యూస్, సంజీవన్ సంజన, నాట్ సీవర్ బ్రంట్, అమేలియా కేర్, రహిలా ఫిర్దౌస్(వికెట్ కీపర్), హర్మన్ప్రీత్ కౌర్(కెప్టెన్), నికోలా కారీ, అమన్జోత్ కౌర్, పూనమ్ ఖెమ్నర్, వైష్ణవీ శర్మ, షబ్నం ఇస్మాయిల్, సంస్కృతి గుప్తా.
ఢిల్లీ క్యాపిటల్స్ తుది జట్టు: షఫాలీ వర్మ, లిజెల్లె లీ(వికెట్ కీపర్), లారా వొల్వార్డ్త్, జెమీమా రోడ్రిగ్స్(కెప్టెన్), దీయా యాదవ్, మరినే కాప్, నిక్కీ ప్రసాద్, లూసీ హామిల్టన్, స్నేహ్ రానా, శ్రీ చరణి, నందిని శర్మ.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: