మేడారం జాతరకు వెళ్లే మహిళా భక్తులకు తెలంగాణ ఆర్టీసీ శుభవార్త అందించింది. జాతర సందర్భంగా నడపనున్న ప్రత్యేక బస్సుల్లో కూడా మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం కొనసాగుతుందని ప్రకటించింది. ‘మహాలక్ష్మి’ పథకం కింద మహిళలు, బాలికలు, ట్రాన్స్జెండర్లు ఈ స్పెషల్ సర్వీసుల్లోనూ టికెట్ లేకుండా ప్రయాణించవచ్చని ఆర్టీసీ స్పష్టం చేసింది. జాతర సమయంలో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
Read also: Ward Reservations: నారాయణఖేడ్ మున్సిపాలిటీ వార్డుల రిజర్వేషన్లు ఖరారు

Free travel for women even on special buses
స్పెషల్ బస్సుల చార్జీలు ఖరారు
మేడారం జాతరకు సంబంధించి ప్రత్యేక బస్సుల టికెట్ ధరలను ఆర్టీసీ అధికారికంగా ఖరారు చేసింది. వరంగల్, హనుమకొండ ప్రాంతాల నుంచి మేడారానికి (Medaram) వెళ్లే బస్సులకు రూ.250 నుంచి రూ.500 వరకు ఛార్జీలు నిర్ణయించారు. అలాగే హైదరాబాద్ నుంచి మేడారానికి ప్రయాణించే భక్తుల కోసం రూ.600 నుంచి రూ.1,110 వరకు టికెట్ ధరలు ఉంటాయని వెల్లడించారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి కూడా మేడారానికి ప్రత్యేక సర్వీసులు నడపనున్నట్లు ఆర్టీసీ తెలిపింది.
భక్తుల రద్దీకి అనుగుణంగా విస్తృత ఏర్పాట్లు
వరంగల్, హనుమకొండ జిల్లాల నుంచి మేడారం జాతరకు పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారని అంచనా వేసిన అధికారులు, ఆ ప్రాంతాల నుంచి ఎక్కువ సంఖ్యలో స్పెషల్ బస్సులు నడపాలని నిర్ణయించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా రాకపోకలు సులభంగా ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. మేడారం జాతర తెలంగాణలోనే అతిపెద్ద గిరిజన జాతరగా గుర్తింపు పొందిన విషయం తెలిసిందే.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: