BMC election results : బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ఎన్నికల్లో దాదాపు 25 ఏళ్లుగా కొనసాగిన థాకరే కుటుంబ ఆధిపత్యానికి తెరపడింది. శుక్రవారం వెలువడిన ఫలితాల్లో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి ఘన విజయం సాధించడంతో శివసేన (యూబీటీ) అధికారాన్ని కోల్పోయింది. ఈ పరిణామం మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక మలుపుగా మారింది.
ఈ ఫలితాలపై నటి, బీజేపీ ఎంపీ Kangana Ranaut స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో తన ఇంటిని కూల్చివేసిన వారికి ఇప్పుడు తగిన శాస్తి జరిగిందని వ్యాఖ్యానించారు. 2020లో అప్పటి ఉద్ధవ్ థాకరే ప్రభుత్వ హయాంలో బీఎంసీ అధికారులు తన కార్యాలయంలోని కొంత భాగాన్ని కూల్చివేయడాన్ని ఆమె గుర్తు చేసుకున్నారు.
Read also : Ahmedabad Flight Crash Case : ఫ్లైట్ క్రాష్ కేసు.. AAIBకి FIP లీగల్ నోటీసులు
మొత్తం 227 వార్డులున్న బీఎంసీలో (BMC election results) అధికారానికి 114 సీట్లు అవసరం కాగా, బీజేపీ–ఏక్నాథ్ షిండే వర్గం శివసేన కూటమి 118 స్థానాలు గెలుచుకుని స్పష్టమైన మెజారిటీ సాధించింది. ఇందులో బీజేపీ 89 సీట్లతో అతిపెద్ద పార్టీగా నిలవగా, షిండే వర్గం 29 సీట్లు దక్కించుకుంది. ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని శివసేన (యూబీటీ) 65 సీట్లకే పరిమితమైంది. కాంగ్రెస్ 24, ఎంఎన్ఎస్ 6 స్థానాల్లో విజయం సాధించాయి.
ఈ విజయంపై ప్రధాని Narendra Modi హర్షం వ్యక్తం చేశారు. దేశంలోనే అత్యంత సంపన్నమైన మున్సిపల్ కార్పొరేషన్ బీజేపీ కూటమి చేతికి రావడంతో త్వరలోనే ముంబైకి కొత్త మేయర్ ఎన్నిక జరగనుంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: