టీమిండియా ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ పరిస్థితి ప్రస్తుతం క్రికెట్ అభిమానులను ఆందోళనకు గురి చేస్తోంది. గాయం కారణంగా ఇప్పటికే కీలక మ్యాచ్లకు దూరమయ్యాడు. ఇప్పటికే న్యూజిలాండ్తో చివరి రెండు వన్డేలకు దూరమైన సుందర్, ఇప్పుడు టీ20లకూ అందుబాటులో లేరు. ఈ విషయాన్ని ఇటీవల బీసీసీఐ తెలిపింది. ఇక ఇప్పుడు ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభమయ్యే T20 వరల్డ్కప్ (T20 World Cup) కు కూడా పూర్తి ఫిట్నెస్ సాధించడం కష్టమని నివేదికలు చెబుతున్నాయి. దీంతో జట్టులో ఆయన స్థానం అనుమానంగానే మారింది.
Read Also: Jadeja dropped from ODI : జడేజా స్థానం ప్రమాదంలోనా? వన్డే కెరీర్పై నీలినీడలు!

టీ20 సిరీస్కు దూరం
BCCI ఒక ప్రకటన విడుదల చేసి, అతను వన్డే సిరీస్ నుంచి వైదొలిగాడని, అతని స్థానంలో ఆయుష్ బదోనిని సిరీస్లో చేర్చినట్టు తెలిపింది.వాషింగ్టన్ సుందర్ న్యూజిలాండ్తో జరిగే 5 మ్యాచ్ల టీ20 సిరీస్కు కూడా దూరమయ్యాడు. Cricbuzz నివేదిక ప్రకారం, అతను 2026 టీ20 ప్రపంచ కప్లో ఆడటం కూడా అనుమానంగా ఉంది,
ఎందుకంటే టోర్నమెంట్ ప్రారంభానికి ముందు అతను కోలుకునే అవకాశం లేదు. BCCI తన ప్రకటనలో, “బౌలింగ్ చేస్తున్నప్పుడు అతని ఎడమ దిగువ పక్కటెముకల ప్రాంతంలో తీవ్రమైన నొప్పిఉంది ” అని పేర్కొంది.తరువాత చేసిన స్కానింగ్ తర్వాత, బోర్డు అతన్ని బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (CoE)కి రిపోర్ట్ చేయమని కోరినట్లు నివేదిక పేర్కొంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: