हिन्दी | Epaper

Dinesh Patnaik: కెనడాపై నిప్పులు చెరిగిన భారత రాయబారి

Vanipushpa
Dinesh Patnaik: కెనడాపై నిప్పులు చెరిగిన భారత రాయబారి

భారత్, కెనడాల మధ్య నెలకొన్న దౌత్యపరమైన ఉద్రిక్తతలు మరోసారి ముదిరాయి. కెనడా గడ్డపై భారత్‌కు వ్యతిరేకంగా పని చేస్తున్న ఉగ్రవాద శక్తులపై చర్యలు తీసుకోవడంలో ఆ దేశం గత 40 ఏళ్లుగా పూర్తిగా విఫలమైందని కెనడాలోని భారత హైకమిషనర్ దినేష్ పట్నాయక్(Dinesh Patnaik) ఘాటుగా విమర్శించారు. కెనడా ప్రభుత్వ బ్రాడ్‌కాస్టర్ ‘సీబీసీ’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన కెనడా తీరును తూర్పారబట్టారు. ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో భారత ఏజెంట్ల ప్రమేయం ఉందంటూ కెనడా చేస్తున్న ఆరోపణలను పట్నాయక్ గట్టిగా తిప్పికొట్టారు. “ఆరోపణలు చేయడం చాలా సులభం.. కానీ వాటికి బలం చేకూర్చే సాక్ష్యాలెక్కడ?” అని ఆయన ప్రశ్నించారు. భారత ప్రభుత్వం ఇలాంటి అనైతిక చర్యలకు ఎన్నడూ పాల్పడదని, ఒకవేళ ఏదైనా ఆధారాలు చూపిస్తే విచారణ చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. కానీ కేవలం ఊహాగానాల ఆధారంగా దేశాన్ని నిందించడం సరికాదని హితవు పలికారు.

Read Also: UIDAI: మీ ఆధార్ కార్డు సేఫ్‌గా ఉందో లేదో ఇలా తెలుసుకొండి

Dinesh Patnaik: కెనడాపై నిప్పులు చెరిగిన భారత రాయబారి
Dinesh Patnaik: కెనడాపై నిప్పులు చెరిగిన భారత రాయబారి


ఉగ్రవాదులు స్వేచ్ఛగా తిరుగుతున్నా చర్యలు తీసుకోవడం లేదు

కెనడా ప్రభుత్వం ఉగ్రవాదం విషయంలో ద్వంద్వ నీతి పాటిస్తోందని ఆయన ఆరోపించారు. 1985లో 329 మంది ప్రాణాలను బలిగొన్న ఎయిర్ ఇండియా (కనిష్క) విమానం పేలుడు ఘటనను ఉదహరిస్తూ.. “40 ఏళ్లు గడిచినా ఇప్పటి వరకు ఆ కేసులో ఒక్కరిని కూడా శిక్షించలేకపోయారు. మీ గడ్డపై ఉగ్రవాదులు స్వేచ్ఛగా తిరుగుతున్నా చర్యలు తీసుకోవడం లేదు” అని విమర్శించారు. భారత్ తగిన ఆధారాలతో ఉగ్రవాదుల జాబితా ఇచ్చినప్పుడు సాక్ష్యాలు సరిపోవు అని చెప్పే కెనడా.. ఇప్పుడు భారత్‌పై నిరాధారమైన ఆరోపణలు చేయడం హాస్యాస్పదంగా ఉందని మండిపడ్డారు. కెనడా కొత్త ప్రధాని మార్క్ కార్నీ భారత్‌తో సంబంధాలను మెరుగుపరుచుకోవాలని చూస్తున్న తరుణంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతంతరించుకున్నాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

కాబూల్, సరిహద్దు ప్రావిన్సులపై పాకిస్తాన్ దాడులు!

కాబూల్, సరిహద్దు ప్రావిన్సులపై పాకిస్తాన్ దాడులు!

తమిళనాడులో వీకే శశికళ కొత్త పార్టీ ప్రారంభం

తమిళనాడులో వీకే శశికళ కొత్త పార్టీ ప్రారంభం

మొజ్తాబా ఖమేనీ ఆరోగ్యంపై డొనాల్డ్ ట్రంప్ క్లారిటీ

మొజ్తాబా ఖమేనీ ఆరోగ్యంపై డొనాల్డ్ ట్రంప్ క్లారిటీ

పెళ్లి నిరాకరించిన వరుడు.. విషం తాగి తల్లీకూతుళ్లు మృతి

పెళ్లి నిరాకరించిన వరుడు.. విషం తాగి తల్లీకూతుళ్లు మృతి

ప్రజాప్రతినిధుల ద్వారా లబ్ధిదారులకు సంక్షేమ లేఖలు

ప్రజాప్రతినిధుల ద్వారా లబ్ధిదారులకు సంక్షేమ లేఖలు

బీసీసీఐ సంచలన నిర్ణయం.. ఐపీఎల్ జట్లకు ప్రాక్టీస్ విషయంలో కొత్త రూల్స్

బీసీసీఐ సంచలన నిర్ణయం.. ఐపీఎల్ జట్లకు ప్రాక్టీస్ విషయంలో కొత్త రూల్స్

మేము కేవలం గర్భాలం కాదు: జపాన్ మహిళల ‘స్టెరిలైజేషన్’ పోరాటం

మేము కేవలం గర్భాలం కాదు: జపాన్ మహిళల ‘స్టెరిలైజేషన్’ పోరాటం

నేటి నుండి విజయవాడలో ఎంఎస్ఎంఈ ఎక్స్ పో

నేటి నుండి విజయవాడలో ఎంఎస్ఎంఈ ఎక్స్ పో

రుతుస్రావ సెలవులు చట్టం చేస్తే మహిళ ఉపాధికే అడ్డంకి: సుప్రీంకోర్టు

రుతుస్రావ సెలవులు చట్టం చేస్తే మహిళ ఉపాధికే అడ్డంకి: సుప్రీంకోర్టు

విదేశీ విద్య పేరిట కన్సల్టెన్సీ మోసం

విదేశీ విద్య పేరిట కన్సల్టెన్సీ మోసం

చైనా పెట్టుబడులకు భారత్ పచ్చజెండా

చైనా పెట్టుబడులకు భారత్ పచ్చజెండా

మెదక్ ప్రభుత్వ ఆసుపత్రి లో ఏసీబీ సోదాలు?

మెదక్ ప్రభుత్వ ఆసుపత్రి లో ఏసీబీ సోదాలు?

📢 For Advertisement Booking: 98481 12870