हिन्दी | Epaper

Raj Thackeray: బెదిరింపులకు భయపడను.. అన్నామలై స్పష్టమైన సందేశం

Rajitha
Raj Thackeray: బెదిరింపులకు భయపడను.. అన్నామలై స్పష్టమైన సందేశం

భారతీయ జనతా పార్టీ నేత కే.అన్నామలైపై మహారాష్ట్ర నవనిర్మాణ సేన అధినేత రాజ్ ఠాక్రే చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. తనను ముంబైకి రానీయబోమని, కాళ్లు నరికేస్తామని వచ్చిన బెదిరింపులపై అన్నామలై ఘాటుగా స్పందించారు. “నన్ను ముంబైకి రాకుండా ఎవరూ అడ్డుకోలేరు. నా కాళ్లు నరకాలని చూస్తే, ఎదుర్కొని నిలబడతాను” అంటూ ఆయన సవాల్ విసిరారు. మరాఠీల గొప్పతనాన్ని తాను ఎప్పుడూ అవమానించలేదని, ముంబై అభివృద్ధిలో మరాఠీయుల పాత్ర విడదీయరానిదని స్పష్టం చేశారు.

Read also: TG Government: సినిమా టికెట్ రేట్ల పేరుతో కోట్లు వసూలు: హరీశ్ రావు

I will not be intimidated by threats

I will not be intimidated by threats

ధోతులు, లుంగీలను హేళన చేయడంపై

అలాగే ధోతులు, లుంగీలను హేళన చేయడంపై అన్నామలై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. భారతదేశంలో ప్రతి భాష, ప్రతి సంస్కృతి గౌరవానికి అర్హమేనని చెప్పారు. తమిళులను తక్కువ చేసే వ్యాఖ్యలు చేసిన శివసేన (యూబీటీ)తో డీఎంకే పొత్తుపై కూడా ఆయన ప్రశ్నలు సంధించారు. ఇటీవల ముంబైలో జరిగిన ర్యాలీలో రాజ్ ఠాక్రే అన్నామలైని ‘రసమలై’ అని వ్యాఖ్యానించడంపై రాజకీయ వర్గాల్లో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ పరిణామాలు ప్రాంతీయ భావోద్వేగాలు, జాతీయ రాజకీయాల మధ్య కొత్త చర్చలకు దారితీస్తున్నాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870