యువతకు మార్గదర్శకుడైన స్వామి వివేకానంద జయంతిని(AndhraPradesh) పురస్కరించుకొని తిరుపతిలో బిజెపి ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. స్థానిక ఎస్వీ మెడికల్ కళాశాల కుడలిలో ఏర్పాటు చేసిన స్వామి వివేకానంద విగ్రహానికి బిజెపి నాయకులు పూలమాలలు వేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ కార్యక్రమానికి విచ్చేసిన బిజెపి నాయకులు మాట్లాడుతూ స్వామి వివేకానంద భారతదేశ ఆధ్యాత్మిక శక్తిని ప్రపంచానికి చాటిచెప్పిన మహా తత్వవేత్త అని కొనియాడారు. యువతలో ఆత్మవిశ్వాసం, దేశభక్తి, క్రమశిక్షణను నూరిపోసిన వ్యక్తిగా స్వామి వివేకానంద ఆదర్శాలు నేటికీ ప్రాసంగికమని తెలిపారు.
Read also: Chandrababu Naidu: నల్లమల సాగర్తో ఎవరికీ నష్టం లేదు: సీఎం

“లేచి నిలబడండి, లక్ష్యాన్ని చేరేవరకు ఆగకండి” అనే స్వామి వివేకానంద సూక్తి ప్రతి యువకుడికి స్ఫూర్తిదాయకమని బిజెపి నాయకులు(AndhraPradesh) అన్నారు. దేశ అభివృద్ధిలో యువత కీలక పాత్ర పోషించాలని, స్వామి వివేకానంద చూపిన మార్గంలో నడిచినప్పుడే బలమైన భారతదేశ నిర్మాణం సాధ్యమవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర మాజీ కార్యవర్గ సభ్యుడు గుండాల గోపీనాథ్ రెడ్డి ,బిజెపి జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి పొనగంటి భాస్కర్ కట్టమంచి చంద్రబాబు యాదవ్, ఆంధ్ర ప్రదేశ్ కాపు కార్పొరేషన్ డైరెక్టర్ వరప్రసాద్, బిజెపి నాయకులు డాక్టర్ విద్వాన్ కస్పా పద్మనాభం, అన్నారెడ్డి రాజశేఖర్ రెడ్డి, జీవీఎస్ ప్రసాద్, మునీంద్ర రెడ్డి, కర్నాట మురళి, ముని కృష్ణయ్య, బిజెపి నార్త్ మండల అధ్యక్షుడు లోక ప్రభాకర్ నాయుడు బిజెపి పడమర మండల అధ్యక్షుడు శ్రీధర్ బిజెపి సెంట్రల్ మండల ఉపాధ్యక్షుడు తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి బిజెపి ఎస్సీ మోర్చా నాయకులు మల్లారపు రవి ప్రసాద్ రమేష్ పురోహితుడు సురేష్ స్వామి రామ్ కుమార్ కార్యకర్తలు పాల్గొని స్వామి వివేకానందకు ఘన నివాళులు అర్పించారు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: