హైదరాబాద్ : పోలవరం-నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టును సవాలు చేస్తూ తెలంగాణ(Telangana) ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టులో సోమవారం విచారణ జనగమన్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం న్యాయపోరాటానికి తరఫున బలమైన వాదనలు వినిపించేందుకు సిద్ధం కావాలని జల వనరులశాఖ మంత్రి విమ్ముల రామానాయుడు న్యాయ బృందాన్ని, ఉన్నతాధికారులను ఆదేశించారు.
Read Also: Makara Sankranti: సంక్రాంతికి సిద్ధమైన తెలుగు రాష్ట్రాలు..

ఆదివారం ఆయన ఈ అంశంపై సీనియర్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వ హించారు. సుప్రీంకోర్టులో ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh Government) తరపున సీనియర్ న్యాయ్ వారి ముకుల్ రోహత్ వాదనలు వినిపించనున్నారు. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల మాట్లాడుతూ ఈ కేసుకు సంబంధించిన అన్ని రికార్థులను, కీలకమైన సమాచారాన్ని వెంటనే న్యాయవాదుల బృందానికి అందించాలని అధికారులను ఆదేశించారు. జలవనరుల శాఖ ప్రత్యేక కార్యదర్శి సాయి ప్రసాద్, సలహాదారు వెంకటేశ్వరరావు, ఇంజినీర్ ఇన్ఫ్రాఫ్ నరసింహమూర్తి, అంతర్రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులు నుంచి సుమారు 3000 టీఎంసీల నీరు సముద్రంలోకి వృథాగా పోతోందని, అందులో నుంచి కేవలం 200 టీఎంసీల నీటిని మాత్ర మే ఈ ప్రాజెక్టు ద్వారా రాయలసీమకు తరలించాలని లక్ష ్యంగా పెట్టు కున్నామని మంత్రి వివరించారు.
దిగువ రాష్ట్రంగా మిగులు జబాలను వాడుకునే హక్కు గోదావరి ఇల వివాదాల ట్రైబ్యునల్ (విజరిగి) అవార్డు ప్రకారమే ఆంధ్రప్రదేశకు ఉందని ఆయన స్పష్టం చేశారు. ‘మేం స్నేహ హస్తం అందిస్తుంటే తెలంగాణ ప్రభుత్వం ఆంధ్రప్రదేశకు అన్యాయం చేసేలా కోర్టుకు వెళ్లడం విచారకరం’ అని, మంత్రి నిమ్మల వ్యాఖ్యానించారు. సముద్రంలో కలిసిపోతున్న నీటిని కరవు పీడిత ప్రాంతమైన రాయలసీమను సస్యశ్యామలం చేయేదానికి వాడుకోవడంలో తప్పేంటని ఆయన ప్రశ్నించారు.
ఈ ప్రాజెక్టు ద్వారా మిగులు నరద జరాలను మాత్రమే వినియోగించుకుంటామని ఆయన పునరుద్ఘాటించారు. ఇప్పటికే ప్రాజెక్టు సాధ్యాసాధ్యాల నివేదికను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించామని, వారి సూచనల మేరకు మార్పులు చేస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం డీపీఆర్ కోసం పిలిచిన టెండర్లు కేవలం ప్రాథమిక సన్నాహక చర్యలు మాత్రమేనని, అన్ని చట్టపరమైన అనుమతులు పొందిన తర్వాతే ప్రాజెక్టు పనులను ప్రారంభిస్తామని మంత్రి నిమ్మల స్పష్టం చేశారు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: