हिन्दी | Epaper

AP: చంద్రబాబుతోనే అభివృద్ధి సాధ్యం: ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి

Saritha
AP: చంద్రబాబుతోనే అభివృద్ధి సాధ్యం: ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి

కోవూరు (నెల్లూరు) : (AP) రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉన్నా అభివృద్ధి, సంక్షేమాన్ని పరుగులు తీస్తున్న ఘనత కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబుకే (CM Chandrababu) సాధ్యమని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అన్నారు. కోవూరు మండలం లేగుంటపాడులోని పద్మజ ఆడిటోరియంలో గురువారం 329 మంది రైతులకు రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత ప్రభుత్వం తమ ఇష్టానుసారంగా రైతులకు ఉపయోగం లేని పాస్ పుస్తకాలు అందజేసిందని, ప్రస్తుత కూటమి ప్రభుత్వం వాటిని సరిదిద్ది రాజముద్రతో కూడిన పాస్ పుస్తకాలను కోవూరు నియోజకవర్గంలో ఐదు మండలాల్లో ఇప్పటివరకు 24979 మంది రైతులకు పంపిణీ చేయడం జరిగిందన్నారు. ఈ 19 నెలల కూటమి ప్రభుత్వ పాలనలో కోవూరు నియోజకవర్గంలో ఊహించని విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు.

Read also: Chittoor: పాఠశాలలకు రేపటి నుంచి సంక్రాంతి సెలవులు

AP
Development is possible only with Chandrababu: MLA Prashanthi Reddy

సూపర్ సిక్స్ ప్రాజెక్టులలో ఘనత కూటమి ప్రభుత్వంకే

ఎన్నికల్లో చెప్పిన విధంగా సూపర్ సిక్స్ ను సూపర్ హిట్ చేసిన ఘనత కూటమి ప్రభుత్వంకే దక్కిందన్నారు. (AP) అదేవిధంగా గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహకారంతో రోడ్లు కూడా శరవేగంగా రూపుదిద్దు కుంటున్నాయన్నారు. రైతుల సంక్షేమానికి ఈ ప్రభుత్వం పూర్తిస్థాయిలో కట్టుబడి ఉందన్నారు. గత ఐదేళ్లలో అభివృద్ధికి నోచుకోని అనేక ప్రాంతాల్లో ప్రస్తుతం ఊహించని విధంగా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వమని, ఇది పేదల సంక్షేమానికి కట్టుబడి ఉందని, ఇటువంటి ప్రభుత్వాన్ని ఎన్నుకున్న ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞుతలు తెలుపుతున్నామన్నారు. ఇప్పటికే లేగుంటపాడు గ్రామంలో ఊహించని విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని, గ్రామ సర్పంచ్ వేణుగోపాల్ అడిగిన మీదట మరో 10 లక్షలు సీసీ రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తున్నామని ప్రజల హర్షద్వానాల నడుమ ప్రకటించారు.

అనంతరం రైతులకు పాసు పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సీహెచ్ సుబ్బయ్య, డిప్యూటీ తహసీల్దార్ మధుసూదన్రావు, పెన్నా డెల్టా ఆయకట్టు చైర్మన్ జెట్టి రాజగోపాల్రెడ్డి, జొన్నవాడ దేవస్థాన చైర్మన్ తిరుమూరు అశోక్ రెడ్డిసొసైటీ అధ్యక్షుడు శ్యామ్ సుందర్రెడ్డి ట్రాన్కో డీఈ మధుసూదన్రెడ్డి, ఏఈ ప్రదీప్.. గ్రామ సర్పంచ్ వేణుగోపాల్రెడ్డి, ఎంపీపీ టి. పార్వతి, సర్పంచ్లు అమరావతి, విజయమ్మ, మాజీ ఎంపీపీ ఉమా, ఎంపీటీసీ సభ్యులు శ్రీనివాసులురెడ్డి, సునీల్ రెడ్డి, నాగరాజు, సీహెచ్ చిన్నయ్య, రమేష్ యాదవ్, డి. శ్రీనివాసులు నాయుడు, బాల రవి, నాటకరాణి వెంకట్, వై. వెంకటరమణమ్మ, శ్రీనివాసులు, దాసరి మురళి, దామోదర్ నాయుడు, చింతలపూడి పెంచలయ్య, కూటమి నాయకులు సీహెచ్ శ్రీనివాసులురెడ్డి, పోలిశెట్టి వెంకట సుబ్బారావు, రైతులు ఉన్నారు.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఇందిరమ్మ ఇళ్ల పెండింగ్ నిధుల విడుదల

ఇందిరమ్మ ఇళ్ల పెండింగ్ నిధుల విడుదల

‘ఇది ఆరంభం మాత్రమే’: రోహిత్

‘ఇది ఆరంభం మాత్రమే’: రోహిత్

మా మధ్య కమ్యూనికేషన్ చాలా సింపుల్‌గా ఉంటుంది: సంజు

మా మధ్య కమ్యూనికేషన్ చాలా సింపుల్‌గా ఉంటుంది: సంజు

ఉరిలో ఉగ్రవాదిని మట్టుబెట్టిన భద్రతా దళాలు

ఉరిలో ఉగ్రవాదిని మట్టుబెట్టిన భద్రతా దళాలు

పీఎం కిసాన్ డబ్బులు రాలేదా.. ఇలా ఫిర్యాదు చేయండి !

పీఎం కిసాన్ డబ్బులు రాలేదా.. ఇలా ఫిర్యాదు చేయండి !

యువతికి HIV రక్తం ఎక్కించిన ప్రియుడు.. కారణం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
1:42

యువతికి HIV రక్తం ఎక్కించిన ప్రియుడు.. కారణం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

ఫైనల్లో భారత్ తడబాటు: ఇంగ్లండ్ సొంతమైన టైటిల్

ఫైనల్లో భారత్ తడబాటు: ఇంగ్లండ్ సొంతమైన టైటిల్

ఇద్దరు పిల్లలను చంపి తల్లి ఆత్మహత్య..అసలేం జరిగింది?

ఇద్దరు పిల్లలను చంపి తల్లి ఆత్మహత్య..అసలేం జరిగింది?

ఏ జట్టూ ఐసీసీ కంటే పెద్దది కాదు: జై షా

ఏ జట్టూ ఐసీసీ కంటే పెద్దది కాదు: జై షా

నెతన్యాహు మరణవార్తలపై స్పందించిన ఇజ్రాయెల్

నెతన్యాహు మరణవార్తలపై స్పందించిన ఇజ్రాయెల్

మొయినాబాద్ డ్రగ్స్ కేసు.. ఎంపీ పుట్టా మహేష్‌కు పాజిటివ్

మొయినాబాద్ డ్రగ్స్ కేసు.. ఎంపీ పుట్టా మహేష్‌కు పాజిటివ్

విశాఖలో లారీ బీభత్సం.. ఆగి ఉన్న వాహనాలపైకి దూసుకెళ్లి

విశాఖలో లారీ బీభత్సం.. ఆగి ఉన్న వాహనాలపైకి దూసుకెళ్లి

📢 For Advertisement Booking: 98481 12870