हिन्दी | Epaper
గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం ఈరోజు బంగారం ధరలు అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం ఈరోజు బంగారం ధరలు అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం ఈరోజు బంగారం ధరలు అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం ఈరోజు బంగారం ధరలు అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం

Uttar Pradesh Crime: ఆస్తి కోసం కుటుంబాన్నే హతమార్చిన వ్యక్తి

Tejaswini Y
Uttar Pradesh Crime: ఆస్తి కోసం కుటుంబాన్నే హతమార్చిన వ్యక్తి

UP News: ఆస్తి పంపకాల విషయంలో చెలరేగిన విరోధాలు ఒక కుటుంబాన్ని పూర్తిగా నాశనం చేసిన ఘటన ఉత్తరప్రదేశ్‌(Uttar Pradesh Crime)లో చోటుచేసుకుంది. తన పేరుపై ఆస్తి బదిలీ చేయలేదన్న కోపంతో ఓ వ్యక్తి తండ్రితో పాటు సోదరి, మైనర్ మేనకోడలిని కిరాతకంగా హత్య (Minor Girl Murder) చేసిన కేసులో నిందితుడైన ముఖేశ్ పటేల్‌ను పోలీసులు అరెస్టు చేశారు.

Read also: JD Vance: అమెరికా ఉపాధ్యక్షుడు నివాసంపై దాడి..? నిందితుడి అరెస్ట్

Uttar Pradesh Crime
Uttar Pradesh Crime: Man kills family over property

పోలీసుల వివరాల ప్రకారం..

పోలీసుల వివరాల ప్రకారం.. లోకాపూర్ గ్రామానికి చెందిన రామసింగ్ (60) తన ఆస్తిని చిన్న కుమారుడు ముకుంద్ లాల్ పేరుపై రాయడం పెద్ద కుమారుడు ముఖేశ్‌కు ఆగ్రహాన్ని తెప్పించింది. కొంతకాలంగా తండ్రితో ఆస్తి విషయంలో అతడు తీవ్ర వాగ్వాదాలకు దిగుతూ వచ్చాడు. ఈ నేపథ్యంలో గత శుక్రవారం రాత్రి ముఖేశ్ తండ్రి నివాసానికి చేరుకుని ఘర్షణకు దిగాడు. వాగ్వాదం ఉద్రిక్తతకు దారితీయడంతో ముఖేశ్ ముందుగా తన తండ్రి రామసింగ్‌ను గొంతు నులిమి హత్య చేశాడు.

అనంతరం అడ్డువొచ్చిన సోదరి సాధన (24), ఆమె కుమార్తె ఆస్థ (14)లను గొడ్డలితో నరికి అమానుషంగా హతమార్చాడు. అనంతరం ఆధారాలు దాచే ఉద్దేశంతో మూడు మృతదేహాలను ఇంటి సమీపంలో ఉన్న పాడుబడిన బావిలో పడేసి, పైభాగాన్ని ఎండుగడ్డితో కప్పివేశాడు.

ట్రిపుల్ మర్డర్‌కు పాల్పడ్డ నిందితుడు అరెస్ట్

హత్యల అనంతరం కూడా ముఖేశ్ ఆగకుండా, మరుసటి రోజు శనివారం తన తమ్ముడు ముకుంద్‌ను హత్య చేయాలని ప్రయత్నించాడు. అతడిపై కాల్పులు జరిపినప్పటికీ, ముకుంద్ తీవ్ర గాయాలతో ప్రాణాలు దక్కించుకున్నాడు. తండ్రి, అక్క కనిపించడం లేదంటూ ముకుంద్ పోలీసులను ఆశ్రయించడంతో ఈ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. తమ్ముడిపై దాడి కేసులో ముఖేశ్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టగా, ట్రిపుల్ మర్డర్(Triple Murder) వ్యవహారం బట్టబయలైంది.

నిందితుడు చూపిన సమాచారం ఆధారంగా బావి నుంచి మూడు మృతదేహాలను వెలికితీశారు. హత్యలకు ఉపయోగించిన గొడ్డలి, కాల్పులకు వాడిన తుపాకీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం నిందితుడు రిమాండ్‌లో ఉండగా, గాయపడిన ముకుంద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870