అల్లు అర్జున్,(Allu Arjun) డైరెక్టర్ అట్లీ కాంబినేషన్లో దాదాపు రూ.1,000 కోట్ల బడ్జెట్తో తెరకెక్కుతున్న భారీ చిత్రం విడుదలకు ముందే రికార్డులు సృష్టించేలా ఉంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ న్యూస్ వైరల్ అవుతోంది. ప్రముఖ OTT సంస్థ నెట్ఫ్లిక్స్ ఈ సినిమా అన్ని భాషల డిజిటల్ రైట్స్ను రూ.600 కోట్లకు దక్కించుకునేందుకు చర్చలు జరుపుతోందని టాక్. డీల్ ఫిక్స్ అయితే భారతీయ చిత్రాల్లో ఇదే అత్యధికం కానుంది.
Read also: Peddi Movie: ‘పెద్ది’ చిత్రంలో ‘అప్పలసూరి’గా జగపతిబాబు

ఈ సినిమాలో దీపికా పదుకొనే, మృణాల్ ఠాకూర్, రష్మిక మందన్న, జాన్వీ కపూర్(Janhvi Kapoor) తదితర స్టార్ హీరోయిన్లు మెరవనున్నారని సమాచారం. (Allu Arjun) అట్లీ, హాలీవుడ్ స్థాయి టెక్నీషియన్లను ఉపయోగించి అత్యాధునిక వీఎఫ్ఎక్స్ హంగులతో ఈ చిత్రాన్ని విజువల్ వండర్గా తీర్చిదిద్దుతున్నాడు. 2027 వేసవిలో రిలీజ్ కానున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ భారీ డీల్ వార్త సోషల్ మీడియాలో ఫ్యాన్స్ మధ్య పెద్ద చర్చకు కారణమవుతోంది. అల్లు అర్జున్ అభిమానులు ఆనందాన్ని వ్యక్తం చేస్తూ “ఇది మా హీరో రేంజ్” అంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్లు పెడుతున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: