हिन्दी | Epaper

Pawar Parivar : కలిసిపోయిన పవార్‌ కుటుంబం.. మున్సిపల్‌ ఎన్నికల్లో కలిసి పోటీ

Sudha
Pawar Parivar : కలిసిపోయిన పవార్‌ కుటుంబం.. మున్సిపల్‌ ఎన్నికల్లో కలిసి పోటీ

మహారాష్ట్ర రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. రెండేండ్ల క్రితం విడిపోయిన ‘పవార్‌’ కుటుంబం (Pawar Parivar) స్థానిక ఎన్నికల వేళ కలిసిపోయింది. మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్‌ పవార్, శరద్ పవార్ ఒక్కటయ్యారు. త్వరలో జరగబోయే పింప్రి-చించ్‌వాడ్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో ఎన్‌సీపీ (ఎస్పీ)-ఎన్‌సీపీ కలిసి పోటీ చేయనున్నాయి. ఈ విషయాన్ని అజిత్ పవార్ అధికారికంగా ప్రకటించారు. ‘పవార్‌ పరివార్‌ (Pawar Parivar) మళ్లీ కలిసింది’ అని ప్రకటించారు. జనవరి 15న జరగబోయే ఎన్నికల్లో కలిసి పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం సీట్ల సర్దుబాటు జరుగుతోందని తెలిపారు. త్వరలో అధికారిక ప్రకటన వస్తుందని వెల్లడించారు. పార్టీ కార్యకర్తలు ఎన్నికల ప్రచారంపై దృష్టిపెట్టాలని సూచించారు.

Read Also : http://Vijay Mallya: వివాదాస్పద వ్యాఖ్యలపై వెనక్కి తగ్గిన లలిత్ మోదీ

Pawar Parivar
Pawar Parivar

కాగా, ఇప్పటికే ఠాక్రే సోదరులు కలిసిపోయిన విషయం తెలిసిందే. సుమారు రెండు దశాబ్దాల తర్వాత ఠాక్రే సోదరులు ఏకమయ్యారు. విభేదాలతో విడిపోయిన శివసేన (ఉద్ధవ్‌ బాలాసాహెబ్‌ ఠాక్రే) పార్టీ చీఫ్‌ ఉద్ధవ్‌ ఠాక్రే, మహారాష్ట్ర నవనిర్మాణ సేన అధ్యక్షుడు రాజ్‌ ఠాక్రే బుధవారం ఒకే వేదికపై కన్పించారు. వచ్చే నెలలో జరగబోయే మున్సిపల్‌ ఎన్నికల్లో ఇద్దరూ కలిసి పోటీ చేయనున్నట్టు ప్రకటించారు. ఇప్పుడు పవార్‌ ఫ్యామిలీ కూడా ఒక్కటి కావడంతో మహా రాజకీయాలు రసవత్తరంగా మారనున్నాయి.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఎల్పీజీ ఉత్పత్తిని పెంచాలని సమర్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు

ఎల్పీజీ ఉత్పత్తిని పెంచాలని సమర్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు

బెంగళూరులో గ్యాస్ దొరక్క హోటళ్లు బంద్..తిండి కోసం విలవిలలాడుతున్నజనం

బెంగళూరులో గ్యాస్ దొరక్క హోటళ్లు బంద్..తిండి కోసం విలవిలలాడుతున్నజనం

ఇరాన్ యుద్దం ముగుస్తుందనే ఆశాభావంతో తగ్గిన ముడి చమురు ధరలు

ఇరాన్ యుద్దం ముగుస్తుందనే ఆశాభావంతో తగ్గిన ముడి చమురు ధరలు

ఎల్పీజీ కొరతతో ముంబయిలో 20 శాతం హోటళ్ల మూత

ఎల్పీజీ కొరతతో ముంబయిలో 20 శాతం హోటళ్ల మూత

త్వరలోనే యుద్ధం ముగింపు..చమురు ధరల్లో భారీ మార్పు!

త్వరలోనే యుద్ధం ముగింపు..చమురు ధరల్లో భారీ మార్పు!

నిర్మాణంలో ఉన్న గోడ కూలి ఏడుగురు కార్మికుల మృతి
0:12

నిర్మాణంలో ఉన్న గోడ కూలి ఏడుగురు కార్మికుల మృతి

గ్యాస్ ధరల షాక్, ఇండక్షన్ కుక్కర్లకు భారీ డిమాండ్

గ్యాస్ ధరల షాక్, ఇండక్షన్ కుక్కర్లకు భారీ డిమాండ్

విజయ్‌పై సొంత పార్టీ నేత విమర్శలు, భార్యపై వ్యాఖ్యల దుమారం

విజయ్‌పై సొంత పార్టీ నేత విమర్శలు, భార్యపై వ్యాఖ్యల దుమారం

సివిల్స్ 301వ ర్యాంకు వివాదం, యూపీఎస్సీ క్లారిటీ

సివిల్స్ 301వ ర్యాంకు వివాదం, యూపీఎస్సీ క్లారిటీ

గోల్డ్ రేట్లు తగ్గుదల, ఈరోజు 24K, 22K ధరలు ఇవే

గోల్డ్ రేట్లు తగ్గుదల, ఈరోజు 24K, 22K ధరలు ఇవే

గ్యాస్ సిలెండర్ల బుకింగ్ పై కేంద్రం మరో షాక్

గ్యాస్ సిలెండర్ల బుకింగ్ పై కేంద్రం మరో షాక్

బెంగళూరులో రేపటి నుంచి హోటళ్లు బంద్

బెంగళూరులో రేపటి నుంచి హోటళ్లు బంద్

📢 For Advertisement Booking: 98481 12870