తెలంగాణలో రైతులకు సౌర విద్యుత్ ప్లాంట్ల విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. పీఎం కుసుమ్ పథకం(TG) కింద కొత్త ఒప్పందాలు ఈ నెలాఖరుతో నిలిపివేయబడ్డాయి. రూ.3.13 ధరతో కొనుగోలు చేయడం డిస్కంలకు భారంగా మారడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కొత్త సంవత్సరంలో ఈ ఒప్పందాలను కొనసాగించాల్సిన అవకాశం ఉండదు. అయితే, తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో 3,000 మెగావాట్ల సౌర విద్యుత్(Electricity) కొనుగోలుకు సిద్ధంగా ఉందని పేర్కొంది. తెలంగాణ రాష్ట్రంలోని రైతుల వ్యవసాయ క్షేత్రాల్లో సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధానమంత్రి కిసాన్ ఊర్జ సురక్ష ఉత్తాన్ మహాభియాన్ పథకం కింద కొత్త విద్యుత్ కొనుగోలు ఒప్పందాల ప్రక్రియను ఈ నెల 31తో నిలిపివేయాలని కేంద్ర నూతన, పునరుద్ధరణీయ ఇంధన వనరుల మంత్రిత్వ శాఖ ఆదేశించింది. కొత్త ఏడాది 2026 నుంచి ఎలాంటి కొత్త ఒప్పందాలకు అవకాశం లేదని స్పష్టం చేయడంతో రాష్ట్రంలోని రైతులకు, ఇంధన రంగానికి ఇది ఒక ప్రధాన మలుపుగా మారింది.
Read Also:

రెండో దశ రద్దు వెనుక విద్యుత్ ధర సమస్య
ఈ పథకం కోసం తెలంగాణ ప్రభుత్వం టీజీ రెడ్కోను నోడల్ ఏజెన్సీగా నియమించింది. (TG) పథకం తొలి దశలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 5 వేల మెగావాట్ల సామర్థ్యమున్న సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు రైతులు ఆసక్తి చూపగా.. వివిధ కారణాల వల్ల కేవలం 1,450 మెగావాట్లకు మాత్రమే ఒప్పందాలు కుదిరాయి. ప్రస్తుతం ఈ ప్లాంట్ల నిర్మాణ పనులు వివిధ దశల్లో ఉన్నాయి. (TG) కాగా, రెండో దశ కింద మరో 20 వేల మెగావాట్ల ప్లాంట్ల ఏర్పాటుకు అనుమతించాలని ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. అయితే రెండో దశపై కేంద్రం నుండి ఇంకా స్పష్టత రాకపోవడంతో.. ప్రస్తుతానికి కొత్త పీపీఏలను నిలిపివేయాల్సి వచ్చింది. ఈ నిర్ణయం వెనుక విద్యుత్ ధరల అంశం ప్రధానంగా కనిపిస్తోంది. తొలి దశ ఒప్పందాల ప్రకారం.. రైతుల నుంచి కొనుగోలు చేసే సౌర విద్యుత్కు యూనిట్కు రూ. 3.13 చెల్లించాలని రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ERC) గతంలో నిర్ణయించింది. అయితే.. ప్రస్తుత మార్కెట్లో సౌర విద్యుత్ ధరలు యూనిట్కు రూ. 3 కంటే తక్కువకే లభిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎక్కువ ధర వెచ్చించి ఒప్పందాలు చేసుకోవడం వల్ల డిస్కంలపై భారం పడుతుందని భావిస్తున్నారు. అందుకే, రూ. 3.13 ధరతో ఒప్పందాలు చేసుకోవడానికి రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థలు సిద్ధంగా లేవు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: