हिन्दी | Epaper

Bangladesh: బంగ్లాదేశ్‌లో మళ్లీ హింసాత్మక నిరసనలు

Vanipushpa
Bangladesh: బంగ్లాదేశ్‌లో మళ్లీ హింసాత్మక నిరసనలు

బంగ్లాదేశ్‌(Bangladesh)లో మరోసారి హింసాత్మక నిరసనలు మిన్నంటాయి. దేశవ్యాప్త ప్రజా ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన యువ నేత, ఇంక్విలాబ్ మంచా ప్రతినిధి షరీఫ్ ఓస్మాన్ హాదీ(Osman Hadi death) మరణవార్త తెలియడంతో బంగ్లాదేశ్ వ్యాప్తంగా ఆందోళనలు చెలరేగాయి. నిరసనకారులు ఆగ్రహంతో మాజీ ప్రధాని షేక్ హసీనా కు చెందిన అవామీ లీగ్ కార్యాలయాలకు నిప్పు పెట్టడమే కాకుండా, ప్రముఖ వార్తాపత్రికల కార్యాలయాలపై కూడా దాడులకు తెగబడ్డారు. డిసెంబర్ 12న ఢాకాలోని పల్టాన్ ప్రాంతంలో ఓస్మాన్ హాదీపై గుర్తుతెలియని దుండగులు కాల్పులు జరిపారు. తలకు తీవ్ర గాయమైన ఆయన్ని మెరుగైన చికిత్స కోసం సింగపూర్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం రాత్రి ఆయన కన్నుమూశారు. ఈ వార్త తెలియగానే వేలాది మంది విద్యార్థులు, మద్దతుదారులు ఢాకాలోని షాబాగ్ కూడలికి చేరుకుని భారీ నిరసన చేపట్టారు.

Read Also: Australia terror plot :ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం.. ఏడుగురు అరెస్ట్‌తో సంచలనం

Bangladesh
Bangladesh

అవామీ లీగ్ ప్రాంతీయ కార్యాలయాన్ని బుల్డోజర్లతో కూల్చివేసి, నిప్పు

హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ పార్టీ మద్దతుదారులే ఈ హత్యకు పాల్పడ్డారని నిరసనకారులు ఆరోపిస్తున్నారు. రాజ్‌షాహీ నగరంలో ఆగ్రహించిన ఆందోళనకారులు అవామీ లీగ్ ప్రాంతీయ కార్యాలయాన్ని బుల్డోజర్లతో కూల్చివేసి, నిప్పు పెట్టారు. అలాగే షేక్ ముజిబుర్ రెహమాన్ నివాసాన్ని కూడా ధ్వంసం చేసినట్లు సమాచారం. దేశంలోని పలు ప్రాంతాల్లో అవామీ లీగ్ నాయకుల ఇళ్లపై దాడులు జరిగాయి. కేవలం రాజకీయ పార్టీలే కాకుండా, దేశంలోని అతిపెద్ద పత్రికలైన ప్రథమ్ అలో, డైలీ స్టార్ కార్యాలయాలపై కూడా దాడులు జరిగాయి. ఈ పత్రికలు చైనా, భారత్ అనుకూల ధోరణితో వ్యవహరిస్తున్నాయని ఆరోపిస్తూ నిరసనకారులు ఢాకాలోని వాటి కార్యాలయాలను ధ్వంసం చేసి, నిప్పు పెట్టారు.

https://twitter.com/GloballyPop/status/2001720995057668100?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2001720995057668100%7Ctwgr%5Ef37e8be0d9dfe76fa53e72e40ca13c4bd5a535b2%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Frtvlive.com%2Finternational%2Fbangladesh-riots-again-after-news-of-osman-hadi-death-10922561

భారత్‌కు వ్యతిరేకంగా నినాదాలు

ఛటోగ్రామ్‌లోని భారత అసిస్టెంట్ హైకమిషన్ కార్యాలయం వెలుపల కూడా నిరసనకారులు బైఠాయించారు. ఈ హత్య వెనుక విదేశీ శక్తుల హస్తం ఉందంటూ భారత్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పరిస్థితి విషమించడంతో పోలీసులు బాష్పవాయువు ప్రయోగించి ఆందోళనకారులను చెల్లాచెదురు చేశారు. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ ముఖ్య సలహాదారు మహమ్మద్ యూనస్ ఓస్మాన్ హాదీ మృతికి తీవ్ర సంతాపం తెలిపారు. శనివారం (డిసెంబర్ 20) నాడు దేశవ్యాప్తంగా జాతీయ సంతాప దినం ప్రకటించారు. హాదీ హంతకులను విడిచిపెట్టబోమని, ప్రజలు సంయమనం పాటించాలని ఆయన కోరారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read also :

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

హర్మూజ్ జలసంధిలో కొత్త రూల్స్

హర్మూజ్ జలసంధిలో కొత్త రూల్స్

ముడి చమురుతో భారత్ చేరుకున్న మరో నౌక.. ‘జగ్ లాడ్కీ’

ముడి చమురుతో భారత్ చేరుకున్న మరో నౌక.. ‘జగ్ లాడ్కీ’

ఉన్నతాధికారులు హతమవుతున్నా బలంగానే ఇరాన్ నాయకత్వం

ఉన్నతాధికారులు హతమవుతున్నా బలంగానే ఇరాన్ నాయకత్వం

ఇజ్రాయెల్ దాడిలో హతమైన బాసిజ్ చీఫ్ ఘోలమ్రెజా సులేమానీ ఎవరు?

ఇజ్రాయెల్ దాడిలో హతమైన బాసిజ్ చీఫ్ ఘోలమ్రెజా సులేమానీ ఎవరు?

ఆర్ఎస్ఎస్ ను నిషేధించాలని యూఎస్ కమిషన్ ఆన్ ఇంటర్నేషనల్ రెలిజియస్ నివేదిక

ఆర్ఎస్ఎస్ ను నిషేధించాలని యూఎస్ కమిషన్ ఆన్ ఇంటర్నేషనల్ రెలిజియస్ నివేదిక

99.93 శాతం మెజారిటీతో కిమ్ జోంగ్ ఉన్ విజయం

99.93 శాతం మెజారిటీతో కిమ్ జోంగ్ ఉన్ విజయం

టెల్ అవీవ్‌పై ఇరాన్ క్లస్టర్ క్షిపణి దాడులు

టెల్ అవీవ్‌పై ఇరాన్ క్లస్టర్ క్షిపణి దాడులు

ట్రంప్ పర్యటన రద్దకు హోర్ముజ్ అభ్యర్థనను చైనా పట్టించుకోకపోవడమే కారణమా?

ట్రంప్ పర్యటన రద్దకు హోర్ముజ్ అభ్యర్థనను చైనా పట్టించుకోకపోవడమే కారణమా?

మొజ్తాబా ఎక్కడున్నా వదిలేది లేదు: ఇజ్రాయెల్ హెచ్చరిక

మొజ్తాబా ఎక్కడున్నా వదిలేది లేదు: ఇజ్రాయెల్ హెచ్చరిక

ఉచిత విమాన టికెట్లు, 2,600 డాలర్లు మనీ ఇస్తాం..భారతీయులకు ఆఫర్

ఉచిత విమాన టికెట్లు, 2,600 డాలర్లు మనీ ఇస్తాం..భారతీయులకు ఆఫర్

లరిజానీ మృతి తర్వాత పరిస్థితులు ఉద్రిక్తం

లరిజానీ మృతి తర్వాత పరిస్థితులు ఉద్రిక్తం

కాబూల్ దాడిపై ఆఫ్ఘన్ క్రికెటర్ ఆవేదన

కాబూల్ దాడిపై ఆఫ్ఘన్ క్రికెటర్ ఆవేదన

📢 For Advertisement Booking: 98481 12870