గ్రామాల్లో సర్పంచ్ ఎన్నికలు (Telangana Panchayat Elections) జోరందుకున్నాయి.పల్లెల్లో ఎన్నికల వాతావరణం నెలకొనగా, సర్పంచి, వార్డు సభ్యుల పదవులకు పోటీ చేసేందుకు అభ్యర్థులు పెద్ద సంఖ్యలో ముందుకు వస్తున్నారు. నామినేషన్ల స్వీకరణ (Telangana Panchayat Elections) కు శనివారం గడువు ముగియనుండటంతో ఈ ప్రక్రియ మరింత ఊపందుకుంది.రెండో రోజైన శుక్రవారం ఒక్కరోజే రాష్ట్రవ్యాప్తంగా సర్పంచి పదవుల కోసం 4,901 నామినేషన్లు దాఖలైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.
Read Also: Telangana: ఇక యాదాద్రికి ఎంఎంటీఎస్ రైలు సౌకర్యం

రెండో రోజు 4,901 సర్పంచి నామినేషన్లు
దీంతో గత రెండు రోజుల్లో కలిపి సర్పంచి స్థానాలకు వచ్చిన మొత్తం నామినేషన్ల సంఖ్య 8,198కి చేరింది. అదేవిధంగా, వార్డు సభ్యుల పదవులకు కూడా భారీ స్పందన లభిస్తోందని, రెండు రోజుల్లో కలిపి 11,502 నామినేషన్లు అందినట్లు అధికారులు వెల్లడించారు.తొలి విడతలో భాగంగా మొత్తం 4,236 గ్రామ పంచాయతీ సర్పంచి పదవులకు,
37,440 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. నామినేషన్ల ప్రక్రియకు శనివారం చివరి రోజు కావడంతో, అభ్యర్థులు పెద్ద సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణల తర్వాత బరిలో నిలిచే తుది అభ్యర్థుల జాబితా వెలువడనుంది.
పంచాయతీరాజ్ వ్యవస్థను తొలిసారిగా ఏ రాష్ట్రం అమలు చేసింది?
రాజస్థాన్ రాష్ట్రం — 1959 అక్టోబర్ 2న నాగౌర్ జిల్లాలో మొదటి పంచాయతీ ఎన్నికలు జరిగాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: