హైదరాబాద్ (సైఫాబాద్): బీసీలకు స్థానిక సంస్థలలో 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ వందలాది మంది బీసీలు గురువారం ట్యాంక్బండ్ (Tankbund) వద్దగల డా. బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించారు. తెలంగాణ (Telangana) బీసీ జాక్ కమిటీ ఆధ్వర్యంలో బీసీలు బషీర్బాగ్లోని నిజాం కళాశాల నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు ప్రదర్శన నిర్వహించారు.
Read Also: D.C.M. Bhatti: సిఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఢిల్లీకి రావడానికి సిద్ధం

కాంగ్రెస్ పార్టీపై ఆర్. కృష్ణయ్య ఆరోపణలు
ఈ సందర్భంగా జాక్ ఛైర్మన్, రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య (R. Krishnaiah) మాట్లాడుతూ, బీసీలకు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేసి, కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ చేసిందని, ఎన్నికల మేనిఫెస్టోలో కూడా ప్రకటించారని చెప్పారు. ఎన్నికల తరువాత అసెంబ్లీలో రెండుసార్లు చట్టం చేసి, మంత్రివర్గంలో కూడా ఆమోదం తెలిపి చివరకు జీవో నెంబరు 9ని జారీ చేసిందని తెలిపారు.
అయితే, బీహార్లో ఎన్నికల తరువాత 42 శాతం రిజర్వేషన్లను 22 శాతానికి తగ్గిస్తూ మరో జీవో 46ను ప్రభుత్వం జారీ చేసిందని ఆయన ఆరోపించారు.
బీసీల డిమాండ్లు, ప్రభుత్వానికి సూచనలు
ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని, గ్రామ పంచాయితీ ఎన్నికలను వాయిదా వేయాలని, అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకువెళ్లి ప్రధాన మంత్రిని ఒప్పించాలని ఆయన డిమాండ్ చేశారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించిన తరువాతే ఎన్నికలు నిర్వహించాలని కోరారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: