Health: అధిక రక్తపోటుతో (హైపర్టెన్షన్) బాధపడుతున్నవారిలో చాలామంది ఒకప్పుడు ట్యాబ్లెట్లు తినడం ఆపేస్తే బాగుపడతామని భావిస్తారు. కానీ వైద్యుల ప్రకారం ఇది అత్యంత ప్రమాదకరమైన నిర్ణయం. రక్తపోటు మందులు అకస్మాత్తుగా మానేయడం వల్ల శరీరంలో రక్తప్రసరణపై తీవ్ర ప్రభావం పడుతుంది. దీంతో రక్తపోటు ఒక్కసారిగా పెరిగిపోవడం, పక్షవాతం (స్ట్రోక్), గుండెపోటు (హార్ట్ అటాక్) వంటి ప్రమాదాలు సంభవించే అవకాశం అధికంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
Read also: Beauty Tips: చర్మానికి నిగారింపు తెచ్చే సులభమైన చిట్కాలు

Health: బీపీ టాబ్లెట్స్ మానేస్తే ప్రమాదమా?
మానేసే ముందు వైద్యుడిని సంప్రదించి
వైద్యుల పర్యవేక్షణ లేకుండా బీపీ మందులను ఆపడం లేదా మార్చడం ఎట్టి పరిస్థితుల్లోనూ చేయరాదు. హైపర్టెన్షన్ వంటి దీర్ఘకాలిక వ్యాధుల్లో మందులు రెగ్యులర్గా తీసుకోవడం ద్వారా మాత్రమే రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. మందులు మానేసే ముందు వైద్యుడిని సంప్రదించి, అతని సూచనల మేరకే మోతాదు తగ్గించాలి లేదా మార్పులు చేయాలి. ఆహారం, వ్యాయామం, మానసిక ప్రశాంతతతో పాటు సరైన వైద్య సూచనలు పాటించడం వల్లే రక్తపోటు నియంత్రణ సాధ్యమని నిపుణులు సూచిస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: