మన పెద్దలు ఎప్పుడూ “ఉదయాన్నే నానబెట్టిన బాదం(Badam) పప్పులు తినాలి” అని చెబుతుంటారు. ఈ సలహా వెనుక గట్టి శాస్త్రీయ కారణాలున్నాయని పోషకాహార నిపుణులు అంటున్నారు. బరువు నియంత్రణ నిపుణురాలు గార్గీ శర్మ చెప్పినట్లుగా, పచ్చి బాదం కంటే రాత్రంతా నీటిలో నానబెట్టి పొట్టు తీసి తినడం వల్ల పోషకాలు శరీరానికి సులభంగా అందుతాయి. జీర్ణక్రియ మెరుగుపడటంతో పాటు శరీరంలో అనేక సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. రోజూ 5 నుండి 8 బాదం పప్పులను ఒక గ్లాస్ నీటిలో రాత్రంతా నానబెట్టాలి.
Read Also: Singer Chinmayi: వైరల్ అవుతున్న సింగర్ చిన్మయి పోస్ట్

ఉదయం వాటిపై ఉండే గోధుమ రంగు పొట్టు తొలగించి తినాలి. ఎందుకంటే ఆ పొట్టులో ఉండే ‘టానిన్లు’ అనే పదార్థాలు పోషకాలు శరీరం గ్రహించకుండా అడ్డుకుంటాయి. ఈ పప్పులను పరగడుపున లేదా అల్పాహారంతో తీసుకోవడం ఉత్తమం. ఈ అలవాటు మొదలుపెట్టిన కొన్ని రోజులకే తేడా తెలుస్తుంది. బాదంలో(Badam) ఉండే ఫైబర్, ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు ఆకలిని నియంత్రిస్తాయి. మధ్యలో చిరుతిళ్లు తినాలనే కోరిక తగ్గుతుంది. అలాగే జీర్ణ సమస్యలు, కడుపు ఉబ్బరం, మలబద్ధకం వంటి ఇబ్బందులు కూడా తగ్గుతాయి.
రెండవ వారం నుంచి బాదంలోని ఎంజైమ్లు జీర్ణక్రియను మరింత చురుకుగా చేస్తాయి. కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తాయి. బాదం తీసుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గి, మంచి కొలెస్ట్రాల్ స్థాయి పెరుగుతుంది, దీంతో గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. బరువు నియంత్రణలో కూడా ఇది సహాయపడుతుంది. నాలుగో వారానికి వచ్చేసరికి శరీరంలోని శక్తి స్థాయిలు పెరుగుతాయి, అలసట తగ్గుతుంది. బాదంలో ఉన్న విటమిన్ E మరియు యాంటీ ఆక్సిడెంట్లు చర్మానికి మెరుపు తెస్తాయి. చర్మం ఆరోగ్యంగా కనిపిస్తుంది. ఉదయాన్నే ఈ అలవాటును కొనసాగించడం మానసిక ఉత్సాహం కూడా పెంచుతుంది.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: