ఉత్తరప్రదేశ్ లోని కాన్సూర్ (Kanpur) లో జరిగిన ఘటన అందరినీ భయభ్రాంతులకు గురిచేసింది. అక్కడ స్కూర్లలో హఠాత్తుగా పేలుళ్ళు సంభవించడంపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాన్పూర్(Kanpur) లోని మర్కజ్ దగ్గరలో ఈ రోజు సాయంత్రం ఈ ఘటన జరిగింది. మూల్గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మిశ్రీ బజార్ ప్రాంతంలో ఈ పేలుడు(Blast) సంభవించింది. పాక్క చేసి ఉన్న స్కూటర్లలో ఇవి జరిగాయి. దీంతో సమీపంలో ఉన్న ఇళ్ళు, దుకాణాలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. పలువురికి గాయాలు కూడా అయ్యాయి. మొత్తం ఆరుగురు వ్యక్తులు గాయపడ్డారని సమాచారం. పేలుళ్ల శబ్ధం 500 మీటర్ల వరకు వినిపించిందని స్థానికులు చెబుతున్నారు.
Keir Starmer: UNSC లో భారత్కు శాశ్వత సభ్యత్వంపై యూకే మద్దతు

పేలుళ్ళు పోలీసుల విచారణ
పేలుళ్ళు సంభవించిన కొద్దిసేపటికే పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. పేలుడుకు గల కారణాలను పరిశీలిస్తున్నారు. బుధవారం రాత్రి 7.30 గంటల ప్రాంతంలో పేలుడు సభవించినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. గాయపడిన వారిని పోలీసులు ఉర్సులా ఆస్పత్రిలో చేర్పించారు. ఈ పేలుళ్ళు ప్రమాదవశాత్తు జరిగాయా లేక ఏదైనా కుట్రా అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు నిర్వహిస్తున్నారు. పూర్తి విచారణ తర్వాతే అసలు విషయాలు వెలుగులోకి వస్తాయని జాయింట్ పోలీస్ కమిషనర్ అశుతోష్ కుమార్ చెప్పారు.
కాన్పూర్ రాజధాని ఏది?
కాన్పూర్ భారతదేశంలోని ఉత్తర రాష్ట్రమైన ఉత్తర ప్రదేశ్లో ఒక ప్రధాన పారిశ్రామిక పట్టణం. ఈ పట్టణం గంగా నది దక్షిణ ఒడ్డున ఉంది, ఇది రాష్ట్ర రాజధాని లక్నోకు పశ్చిమాన 80 కి.మీ దూరంలో ఉంది. దీనిని రాష్ట్ర పారిశ్రామిక రాజధాని అని కూడా పిలుస్తారు.
Read Also: Read hindi news: hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: