Coldrif Cough Syrup: చిన్నారుల మృతికి కారణమైన దగ్గు సిరప్ syrup ఘటనపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్ఓ) దృష్టి సారించింది. మధ్యప్రదేశ్లో సుమారు 20 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయిన ఈ ఘటన దేశవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోంది. తమిళనాడులోని కాంచీపురానికి చెందిన శ్రీసన్ ఫార్మా యూనిట్ తయారు చేసిన “కోల్డ్రిఫ్” సిరప్ వల్లే ఈ మరణాలు సంభవించాయని ఆరోగ్య అధికారులు నిర్ధారించారు. డబ్ల్యుహెచ్ఓ, WHO ఈ మందు ఇతర దేశాలకు ఎగుమతి అయ్యిందా అని భారత్ ప్రభుత్వాన్ని అడిగింది. సంబంధిత అధికారుల నుంచి వివరణ వచ్చిన తర్వాత, గ్లోబల్ మెడికల్ ప్రొడక్ట్స్ అలర్ట్ జారీ చేయాలా వద్దా అనే విషయాన్ని సమీక్షించనున్నట్లు తెలిపింది.
Karur stampede: కరూర్ తొక్కిసలాట .. స్పందించిన రిషబ్ శెట్టి

WHO
మధ్యప్రదేశ్ ఆరోగ్య శాఖ మంత్రి రాజేంద్ర శుక్లా Rajendra Shukla ప్రకారం, చింద్వాడ ప్రాంతంలోనే 17 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. మరో ఐదుగురి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని తెలిపారు. తనిఖీల్లో కోల్డ్రిఫ్ సిరప్లో 48.6 శాతం డైఇథైలిన్ గ్లైకాల్ ఉన్నట్లు బయటపడింది ఇది అత్యంత ప్రమాదకర రసాయనమని అధికారులు తెలిపారు. కంపెనీపై కఠిన చర్యలు తీసుకునేందుకు చర్యలు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే తెలంగాణతో సహా పలు రాష్ట్రాలు ఈ మందు విక్రయాన్ని నిషేధించాయి.
Read hindi news: hindi.vaartha.com
EPaper: https://epaper.vaartha.com/
Read Also: