हिन्दी | Epaper

IMD Alert: పలు జిల్లాలకు ‘ఫ్లాష్ ఫ్లడ్’ ముప్పు: ఐఎండీ అలర్ట్

Vanipushpa
IMD Alert: పలు జిల్లాలకు ‘ఫ్లాష్ ఫ్లడ్’ ముప్పు: ఐఎండీ అలర్ట్

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) కోస్తా తీరం అతలాకుతలమవుతోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కుండపోత వర్షాలతో పలు జిల్లాల్లో జనజీవనం స్తంభించింది. ఈ నేపథ్యంలో, రానున్న 24 గంటల్లో కోస్తాంధ్ర, యానాం ప్రాంతాలకు ఆకస్మిక వరదలు (ఫ్లాష్ ఫ్లడ్స్) సంభవించే ప్రమాదం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా తూర్పుగోదావరి, గుంటూరు, కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాలతో పాటు యానాం(Yanam)లో ఈ ముప్పు అధికంగా ఉందని స్పష్టం చేయడంతో అధికార యంత్రాంగం తక్షణ చర్యలు చేపట్టింది.

పలు జిల్లాలకు 'ఫ్లాష్ ఫ్లడ్' ముప్పు: ఐఎండీ అలర్ట్
పలు జిల్లాలకు ‘ఫ్లాష్ ఫ్లడ్’ ముప్పు: ఐఎండీ అలర్ట్

కృష్ణా నదికి వరద నీరు భారీగా వరదనీరు

వర్షాల కారణంగా కృష్ణా నదికి వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. విజయవాడలోని ప్రకాశం బ్యారేజీ వద్ద వరద ప్రవాహం 4 లక్షల క్యూసెక్కులు దాటుతుండటంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. నదీ పరివాహక ప్రాంతాలు, లంక గ్రామాల్లో నివసించే ప్రజలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ సూచించారు. ఎవరూ వరద నీటిలో ఈతకు వెళ్లవద్దని, చేపల వేట కోసం నదిలోకి ప్రవేశించవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.

నాటు పడవలపై ప్రయాణాలు ప్రమాదకరం

నాటు పడవలపై ప్రయాణాలు ప్రమాదకరమని హెచ్చరించారు. ముందుజాగ్రత్త చర్యగా కళింగపట్నం, విశాఖ, కాకినాడ, మచిలీపట్నం పోర్టులలో ప్రమాద సూచికలను ఏర్పాటు చేశారు. ప్రస్తుత అల్పపీడనం శుక్రవారానికి మరింత బలపడి పశ్చిమ వాయవ్య దిశగా ఉత్తరాంధ్ర-ఒడిశా వైపు కదిలే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారి జగన్నాథ్ కుమార్ తెలిపారు. దీని ప్రభావంతో కోస్తాంధ్రలో మరో వారం రోజుల పాటు వర్షాలు కొనసాగవచ్చని ఆయన అంచనా వేశారు. గురువారం నాడు శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి, విజయనగరం, నంద్యాల, పల్నాడు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేశారు.

వరద గురించి

సహజంగా మిగులు నీటి ప్రవాహంతో సంబంధం ఉన్న భారీ వర్షాల వల్ల ఆక్రమణలు, ప్రణాళిక లేని అభివృద్ధి మరియు వంటి వాటి వల్ల వరదలు సంభవిస్తాయి. నీటి పరిమాణాన్ని నిర్వహించడానికి సాధారణ సామర్థ్యం కంటే ఎక్కువ వర్షపాతం చారిత్రాత్మకంగా చదునైన స్థాయిలలో నిర్మించిన నగర దృశ్యాలలో వరదలకు దారితీస్తుంది.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/huge-amount-of-marijuana-and-chocolates-seized-through-railways/andhra-pradesh/530080/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

అమరావతిలో భారీ విగ్రహం ఆవిష్కరణ.. పాల్గొన్న చంద్రబాబు, పవన్!
0:30

అమరావతిలో భారీ విగ్రహం ఆవిష్కరణ.. పాల్గొన్న చంద్రబాబు, పవన్!

అనుమానంతో భార్యను చంపి.. భర్త ఆత్మహత్య

అనుమానంతో భార్యను చంపి.. భర్త ఆత్మహత్య

ట్రాన్స్ పోర్ట్ అధికారుల సంఘం ఎన్నికలు ఏకగ్రీవం

ట్రాన్స్ పోర్ట్ అధికారుల సంఘం ఎన్నికలు ఏకగ్రీవం

టిటిడి విద్యాసంస్థల్లో ‘స్మార్ట్’ చదువులకు బాబు ఆదేశం

టిటిడి విద్యాసంస్థల్లో ‘స్మార్ట్’ చదువులకు బాబు ఆదేశం

పాశుపతెశ్వర ఆలయ పునరుద్ధరణకు చర్యలు

పాశుపతెశ్వర ఆలయ పునరుద్ధరణకు చర్యలు

అత్యుత్తమ ఫలితాలు సాధించండి

అత్యుత్తమ ఫలితాలు సాధించండి

ప్రారంభమైన టెన్త్ పరీక్షలు.. విద్యార్థులకు వైఎస్ జగన్ ‘ఆల్ ది బెస్ట్’

ప్రారంభమైన టెన్త్ పరీక్షలు.. విద్యార్థులకు వైఎస్ జగన్ ‘ఆల్ ది బెస్ట్’

69 లక్షల మంది రైతులకు కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు

69 లక్షల మంది రైతులకు కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు

శ్రీశైలంలో నేటి నుంచే ఉగాది ఉత్సవాలు

శ్రీశైలంలో నేటి నుంచే ఉగాది ఉత్సవాలు

డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసు.. విచారణకు హాజరైన లక్ష్మీదుర్గ

డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసు.. విచారణకు హాజరైన లక్ష్మీదుర్గ

ఓటర్ల జాబితా సవరణ ఒక నిరంతర ప్రక్రియ: పి.వి.ఎన్. మాధవ్

ఓటర్ల జాబితా సవరణ ఒక నిరంతర ప్రక్రియ: పి.వి.ఎన్. మాధవ్

24×7 గ్యాస్ కష్టాలే! పల్లె నుంచి పట్టణం దాకా సామాన్యుడి హాహాకారాలు!

24×7 గ్యాస్ కష్టాలే! పల్లె నుంచి పట్టణం దాకా సామాన్యుడి హాహాకారాలు!

📢 For Advertisement Booking: 98481 12870