हिन्दी | Epaper

Kandula Durgesh: పర్యాటక రంగ అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ

Anusha
Kandula Durgesh: పర్యాటక రంగ అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ

టూరిజం మంత్రి కందుల దుర్గేష్

విజయవాడ : రాష్ట్ర పర్యాటక రంగ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక రూపొందించుకొని, విస్తృత ప్రచారం కల్పించి మరింత అభివృద్ధి పథంలో తీసుకెళ్లాలని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ అధికారులకు సూచించారు. వెలగపూడి సెక్రటేరియట్ రెండవ బ్లాక్ లోని తన పేషిలో ఈ మేరకు రాష్ట్ర పర్యాటక శాఖ అధికారులతో మంత్రి కందుల దుర్గేష్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రస్తుత పర్యాటక ప్రాజెక్టుల స్థితిగతులు, కొత్త ప్రాజెక్టులకు డీపీఆర్ (DPR) ల తయారీ, క్యారవాన్, హోమ్ స్టే పాలసీ విధివిధానాలు, ఇతర రాష్ట్రాల్లో ప్రచారం, కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా వచ్చే నిధులు, రీజినల్ సమ్మిట్ లు, శాఖాపరమైన సమావేశాలు, ఇటీవల కుదుర్చుకున్న ఎంవోయూలు, క్షేత్రస్థాయి పర్యటనల షెడ్యూల్ తదితర అంశాలపై మంత్రి దుర్గేష్ అధికారులతో చర్చించారు.

ప్రచారం కల్పించాల్సిన

ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ (Kandula Durgesh) మాట్లాడుతూ ఏపీలో 25 వేల కోట్ల పర్యాటక పెట్టుబడులు, 50వేల గదుల ఏర్పాటు లక్ష్యంగా పనిచేయాలని అధికారులకు సూచించారు. రాష్ట్ర పర్యాటక రంగానికి విస్తృత ప్రచారం కల్పించాల్సిన అవసరాన్ని అధికారులకు వెల్లడించారు. ఈ క్రమంలో హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై, కలకత్తా, ముంబయిలలో రోడ్ షోలు ఏర్పాటు చేసి రాష్ట్ర పర్యాటక ప్రాంతాలకు ప్రాచుర్యం కల్పించాలని ఆదేశించారు. అదే విధంగా రాష్ట్రవ్యాప్తంగా 22 దేవాలయాల్లో టెంట్ సిటీలతో పాటు ఇగ్లూ తరహా ఇళ్ల విషయం ఆలోచించాలన్నారు.

బీచ్ పరిశుభ్రత

అనంతరం విశాఖపట్నంలోని రుషికొండ బ్లూఫ్లాగ్ బీచ్ సుందరీకరణ అంశంపై చర్చించారు. పర్యాటకుల సంఖ్య క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రమాణాలకు అనుగుణంగా పర్యాటకుల భద్రత, బీచ్ పరిశుభ్రత విషయంలో తీసుకోవాల్సిన చర్యలపై పలు సూచనలు చేశారు. నిరుపయోగంగా ఉన్న నిర్మాణాలను తొలగించి పర్యాటకులకు అవసరమైన మోలిక సదుపాయాలు కల్పించాలని సూచించారు. లేపాక్షి, లంబసింగి (Lambasingi) పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి సంబంధించిన సరైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని మంత్రి దుర్గేష్ అధికారులను ఆదేశించారు.

కందుల దుర్గేష్ ఏ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు?

ఆయన 2024లో మాచిలీపట్నం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

కందుల దుర్గేష్ జన్మస్థలం ఎక్కడ?

ఆయన ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లాకు చెందినవారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also: Nara Lokesh: అత్యున్నత ప్రమాణాలతో పారదర్శకంగా ఉత్తమ ఉపాధ్యాయుల ఎంపిక

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

జిల్లా పరిషత్ లో జడ్పీ స్టాండింగ్ కమిటీ సమావేశాలు నిర్వహణ

జిల్లా పరిషత్ లో జడ్పీ స్టాండింగ్ కమిటీ సమావేశాలు నిర్వహణ

పదో తరగతి పరీక్షలకు పటిష్ట బందోబస్త్ ఏర్పాటు: జిల్లా ఎస్.పి.

పదో తరగతి పరీక్షలకు పటిష్ట బందోబస్త్ ఏర్పాటు: జిల్లా ఎస్.పి.

గ్యాస్ బుకింగ్‌పై మంత్రి పయ్యావుల కేశవ్ కీలక వ్యాఖ్యలు

గ్యాస్ బుకింగ్‌పై మంత్రి పయ్యావుల కేశవ్ కీలక వ్యాఖ్యలు

ద్వారకా తిరుమలలో గ్యాస్ సిలిండర్ మాయం

ద్వారకా తిరుమలలో గ్యాస్ సిలిండర్ మాయం

శనివారం గోవింద నామస్మరణతో పులకిస్తున్న ఆధ్యాత్మిక నగరం.

శనివారం గోవింద నామస్మరణతో పులకిస్తున్న ఆధ్యాత్మిక నగరం.

ప్రేమ విఫలమై యువకుడి ఆత్మహత్య

ప్రేమ విఫలమై యువకుడి ఆత్మహత్య

గ్యాస్ కొరతను సృష్టిస్తున్న ఏజెన్సీలపై కఠిన చర్యలు తీసుకోవాలి

గ్యాస్ కొరతను సృష్టిస్తున్న ఏజెన్సీలపై కఠిన చర్యలు తీసుకోవాలి

ఆపరేషన్ వజ్రపహార్.. గంజాయి, రౌడీషీటర్లపై పోలీసుల ఉక్కుపాదం!

ఆపరేషన్ వజ్రపహార్.. గంజాయి, రౌడీషీటర్లపై పోలీసుల ఉక్కుపాదం!

శ్రీవారి ఆలయంలో మార్చి నెలలో మూడు ఆస్థానాలు

శ్రీవారి ఆలయంలో మార్చి నెలలో మూడు ఆస్థానాలు

పెట్టుబడులు రావడాన్ని జీర్ణించుకోలేక వైసిపి దుష్ప్రచారం

పెట్టుబడులు రావడాన్ని జీర్ణించుకోలేక వైసిపి దుష్ప్రచారం

నేడు గిరిజన పల్లెలో జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

నేడు గిరిజన పల్లెలో జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

జనసేన 13వ ఆవిర్భావ దినోత్సవం.. సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు

జనసేన 13వ ఆవిర్భావ దినోత్సవం.. సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు

📢 For Advertisement Booking: 98481 12870