हिन्दी | Epaper
ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్ ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్ ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్ ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్

Brics: భద్రతా మండలిలో భారత్ పాత్ర పెంచాల్సిందే: బ్రిక్స్ దేశాలు

Vanipushpa
Brics: భద్రతా మండలిలో భారత్ పాత్ర పెంచాల్సిందే: బ్రిక్స్ దేశాలు

ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిని సమకాలీన అవసరాలకు అనుగుణంగా మార్చుకోవాల్సిన అవసరాన్ని బ్రిక్స్ (BRICS) దేశాలు పునరుద్ఘాటించాయి. బ్రెజిల్‌(Brizil)లో జరిగిన 17వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంలో భాగంగా భారత్, బ్రెజిల్​(India, Brizil)కు ఐక్యరాజ్యసమితి(UNO)లో ముఖ్యంగా భద్రతా మండలిలో మరింత ప్రాధాన్యం కలిగి ఉండాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పాయి. ఈ ప్రతిపాదనకు చైనా, రష్యా(china, Russia)లు తమ మద్దతుగా నిలిచాయి. “భద్రతా మండలిని మరింత ప్రజాస్వామ్యవంతమైన, సమర్థవంతమైనదిగా మారాల్సిన అవసరం ఉందని మేము నమ్ముతున్నాం” అని ఉమ్మడి ప్రకటనలో బ్రిక్స్ దేశాలు పేర్కొన్నాయి. అభివృద్ధి చెందుతున్న దేశాలకు, ముఖ్యంగా ఆఫ్రికా, ఆసియా, లాటిన్ అమెరికా దేశాలకు సభ్యత్వంలో మెరుగైన ప్రాతినిధ్యం కల్పించాలని బ్రిక్స్ అభిప్రాయపడింది.

శాశ్వత సభ్యత్వం కోసం!
భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కోసం భారత్ చాలా ఏళ్లుగా వేచి చూస్తోంది. ఇప్పటికే భారత్​కు సభ్య దేశాలు మద్దతు తెలిపాయి. ఈసారి బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం ప్రకటనలో చైనా స్వయంగా శాశ్వత సభ్యదేశంగా ఉండేందుకు భారత్‌కు మద్దతు ఇవ్వడం విశేషం. ఈసారి బ్రిక్స్ సదస్సు బ్రెజిల్ అధ్యక్షతన జరుగుతోంది.

Brics: భద్రతా మండలిలో భారత్ పాత్ర పెంచాల్సిందే: బ్రిక్స్ దేశాలు
Brics: భద్రతా మండలిలో భారత్ పాత్ర పెంచాల్సిందే: బ్రిక్స్ దేశాలు

ఆంక్షలపై బ్రిక్స్ ఆందోళన
ప్రపంచ వాణిజ్యంలో ఏకపక్ష ఆంక్షలు, అధిక టారిఫ్‌లు, రక్షణాత్మక చర్యలపై బ్రిక్స్ సభ్య దేశాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. డబ్ల్యూటీఓ ప్రాథమిక నిబంధనలు ఉల్లంఘించేలా వ్యవహరిస్తున్న చర్యలు సరఫరా గొలుసులను ప్రభావితం చేసి, అభివృద్ధి చెందుతున్న దేశాలకు అన్యాయం చేస్తున్నాయని పేర్కొన్నాయి. WTO కేంద్రంగా ఉన్న పారదర్శకమైన, బహుపాక్షిక వాణిజ్య వ్యవస్థను మేము బలోపేతం చేయాలనుకుంటున్నామని సభ్య దేశాలు ఉమ్మడి ప్రకటనలో చెప్పాయి. అలాగే, యూఎన్ఎస్​సీ ఆమోదించని ఏకపక్ష ఆర్థిక ఆంక్షలు మానవహక్కులకు భంగం కలిగిస్తున్నాయని బ్రిక్స్ నాయకులు అన్నారు. అలాంటి ఆంక్షలు పేద దేశాల్లో ప్రజల జీవన ప్రమాణాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని హెచ్చరించారు.

21వ శతాబ్దం సాఫ్ట్‌వేర్‌ను 20వ శతాబ్దపు టైప్‌రైటర్‌పై నడపలేం: మోదీ
ఐరాస భద్రతా మండలి, ప్రపంచ వాణిజ్య సంస్థలో సంస్కరణలపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. విస్తరణతో ప్రపంచ పరిస్థితులకు అనుగుణంగా మారగల సామర్థ్యం బ్రిక్స్ కు ఉందని భారత ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఇప్పుడు ఇదే స్ఫూర్తితో ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (UNSC), ప్రపంచ వాణిజ్య సంస్థ (WTO), బహుపాక్షిక అభివృద్ధి బ్యాంకులను కూడా సంస్కరించాలని పిలుపినిచ్చారు. ఏఐ కాలంలో ప్రతి వారం టెక్నాలజీ మారుతున్నదని చెప్పారు. 80 ఏళ్లుగా మారని గ్లోబల్ సంస్థలు అనుసంధానాన్ని కోల్పోతున్నాయని పరోక్షంగా భద్రతా మండలిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

మిలిటరీ ఖర్చులపై అసంతృప్తి
బ్రిక్స్ దేశాలు ప్రపంచంలో మిలిటరీ ఖర్చులు పెరగడం, విభజన ధోరణి పెరగడం పట్ల అసంతృప్తిని వ్యక్తం చేశాయి. అభివృద్ధి అవసరాలకు తగిన నిధులు కేటాయించకపోవడం వల్ల పేద దేశాలు మరింత వెనుకబడతాయని హెచ్చరించాయి. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న మిలిటరీ ఖర్చులు, విభజన ధోరణిపై బ్రిక్స్ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. అభివృద్ధి అవసరాలకు తగిన నిధులు కేటాయించడంలో ఎక్కడో లోపం జరుగుతుందని పేర్కొన్నారు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో అభివృద్ధి అవసరాలపై నిధులు తగ్గుతున్నాయని సూచించారు. అంతర్జాతీయ స్థాయిలో శాంతి, భద్రత బలోపేతానికి రాజకీయ-శాస్త్రీయ పరిష్కారాలపై దృష్టి పెట్టాలని బ్రిక్స్ దేశాలు పిలుపునిచ్చాయి.

Read Also: hindi.vaartha.com

Read Also: Masood Azar: పాకిస్థాన్‌కు మసూజ్ అజర్‌ ఎక్కడున్నాడో

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

సీఎం రేవంత్ కి ప్రఖ్యాత హార్వర్డ్‌ కెన్నెడీ స్కూల్‌ నుంచి ఆహ్వానం

సీఎం రేవంత్ కి ప్రఖ్యాత హార్వర్డ్‌ కెన్నెడీ స్కూల్‌ నుంచి ఆహ్వానం

అమెరికా–ఇరాన్ ఉద్రిక్తతలకు బ్రేక్? చర్చల వైపు అడుగులు

అమెరికా–ఇరాన్ ఉద్రిక్తతలకు బ్రేక్? చర్చల వైపు అడుగులు

అమెరికాకు ఎలాన్ మస్క్ షాక్!

అమెరికాకు ఎలాన్ మస్క్ షాక్!

సిగరెట్‌ ప్రియులకు బిగ్‌షాక్‌.. రూ.18 సిగరెట్ రూ.72!

సిగరెట్‌ ప్రియులకు బిగ్‌షాక్‌.. రూ.18 సిగరెట్ రూ.72!

పాక్ దాడులు.. 125 మంది మృతి

పాక్ దాడులు.. 125 మంది మృతి

ప్రపంచంలోనే తొలిసారిగా గోల్డ్ స్ట్రీట్‌ను నిర్మిస్తున్న దుబాయ్

ప్రపంచంలోనే తొలిసారిగా గోల్డ్ స్ట్రీట్‌ను నిర్మిస్తున్న దుబాయ్

భారత్‌పై 50% సుంకాలు? ట్రంప్ నిర్ణయంపై షాక్ కామెంట్స్!

భారత్‌పై 50% సుంకాలు? ట్రంప్ నిర్ణయంపై షాక్ కామెంట్స్!

రికార్డ్ స్థాయి లో పడిన పాకిస్థాన్ పసిడి రేట్లు

రికార్డ్ స్థాయి లో పడిన పాకిస్థాన్ పసిడి రేట్లు

భారతీయ విద్యార్థికి జైలు శిక్ష..ఎందుకంటే?

భారతీయ విద్యార్థికి జైలు శిక్ష..ఎందుకంటే?

ఇజ్రాయెల్‌తో ట్రంప్‌ రాజీ..ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌లో విస్తుపోయే నిజం

ఇజ్రాయెల్‌తో ట్రంప్‌ రాజీ..ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌లో విస్తుపోయే నిజం

గ్రీన్ ల్యాండ్‌ ను వెంటాడుతున్న రెండు ప్రమాదాలు

గ్రీన్ ల్యాండ్‌ ను వెంటాడుతున్న రెండు ప్రమాదాలు

ఆ దేశం అమ్మాయిలతో ఎఫైర్..ఎప్‌స్టీన్‌ ఆరోపణలు

ఆ దేశం అమ్మాయిలతో ఎఫైర్..ఎప్‌స్టీన్‌ ఆరోపణలు

📢 For Advertisement Booking: 98481 12870