కేరళలో ప్రాణాంతక నిఫా వైరస్ (Nipah Virus)మళ్లీ కలకలం రేపుతోంది. ఈ వైరస్ కారణంగా ఓ యువతి మృతి చెందింది. మరొకరు చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో, రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు కీలక జిల్లాల్లో హైఅలర్ట్ ప్రకటించింది.
ఘటన వివరాలు
వివరాల్లోకి వెళితే, మలప్పురం జిల్లాకు చెందిన 18 ఏళ్ల ఇంటర్ విద్యార్థిని నిఫా (Nipah Virus) బారిన పడి జూలై 1న ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో మృతి చెందింది. తీవ్రమైన జ్వరం, వాంతులతో బాధపడుతున్న ఆమెను కొట్టక్కల్లోని (Kottakkal)ఆసుపత్రికి తీసుకురాగా, అప్పటికే బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు నిర్ధారించారు. ఇదే సమయంలో, పాలక్కాడ్కు చెందిన 39 ఏళ్ల మహిళ కూడా ఇదే వైరస్తో బాధపడుతున్నట్లు తేలింది. వీరిద్దరి నమూనాలను పూణేలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపగా, నిఫా పాజిటివ్గా నిర్ధారణ అయింది.
ప్రభుత్వం స్పందన – హైఅలర్ట్ & క్వారంటైన్
ఈ పరిణామంతో కేరళ ఆరోగ్య శాఖ వెంటనే రంగంలోకి దిగింది. ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్(Veena George).. కోజికోడ్, మలప్పురం, పాలక్కాడ్ జిల్లాల్లో హైఅలర్ట్ జారీ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ముందుజాగ్రత్త చర్యగా, మరణించిన యువతికి చికిత్స అందించిన 43 మంది ఆరోగ్య సిబ్బందిని క్వారంటైన్లో ఉంచారు.

నిఫా వైరస్ – సమాచారం
నిఫా (Nipah Virus) అనేది జంతువుల నుంచి, ముఖ్యంగా గబ్బిలాలు, పందుల ద్వారా మనుషులకు వ్యాపించే ఒక వైరల్ వ్యాధి. ఇది సోకిన వారిలో తీవ్రమైన జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పులతో పాటు మెదడువాపు (ఎన్సెఫలైటిస్) లేదా తీవ్ర శ్వాసకోశ సమస్యలకు దారితీస్తుంది. దీనికి నిర్దిష్టమైన చికిత్స లేకపోవడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ దీనిని అత్యంత ప్రమాదకరమైన వ్యాధుల్లో ఒకటిగా పరిగణిస్తోంది.
అప్రమత్తంగా ఉండాల్సిన జాగ్రత్తలు:
పండ్లు తినే ముందు శుభ్రంగా కడగాలి, గబ్బిలాలు, పందుల నివాస ప్రాంతాలకు దూరంగా ఉండాలి.
జ్వరం, తలనొప్పి, వాంతులు వంటి లక్షణాలుంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. రోగులను శుభ్రంగా చూసుకోవాలి, వ్యాధి వ్యాప్తిని నివారించేందుకు హైజీన్ పాటించాలి.
Read hindi news: hindi.vaartha.com
Read Also: Amarnath Yatra: జమ్మూకశ్మీర్లో అదుపు తప్పిన బస్సు 36 మందికి