టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ షమీ, ఆయన మాజీ భార్య హసీన్ జహాన్ మధ్య వివాదం మరోసారి వార్తల్లో నిలిచింది. తాజాగా హసీన్ జహాన్ (Hasin Jahan), సోషల్ మీడియాలో షమీపై తీవ్ర వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది. షమీకి వ్యక్తిత్వం లేదని, అతడు క్రూరమైన మనస్తత్వం ఉన్నవాడని హసీన్ జహాన్ తీవ్ర ఆరోపణలు చేశారు. వారి విడాకుల కేసులో కోర్టు ఆదేశాలు వెలువడిన కొద్ది రోజులకే ఆమె ఈ వ్యాఖ్యలు చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.హసీన్ జహాన్ తన ఇన్స్టాగ్రామ్ వేదికగా ఒక భావోద్వేగభరితమైన పోస్టు చేశారు. గత ఏడేళ్లుగా న్యాయపోరాటం చేస్తున్నానని, షమీ (Mohammed Shami) తన దురాశతో కుటుంబాన్ని నాశనం చేశాడని ఆమె తన ఇన్స్టాగ్రామ్ పోస్టులో ఆవేదన వ్యక్తం చేశారు. “మమ్మల్ని అంతమొందించడానికి, పరువు తీయడానికి ఎంతమంది క్రిమినల్స్కు డబ్బులిచ్చావో? వేశ్యలకు, నేరస్థులకు ఇచ్చిన డబ్బును మన కుమార్తె భవిష్యత్తు కోసం ఖర్చు చేసి ఉంటే మన జీవితం గౌరవంగా ఉండేది” అని హసీన్ జహాన్ ఆ పోస్టులో పేర్కొన్నారు.

షమీని ఉద్దేశించి ఆమె ఘాటు వ్యాఖ్యలు చేశారు
భగవంతుడు తనకు ఎంతో ధైర్యాన్ని, సహనాన్ని ఇచ్చాడని, అందుకే నిజం కోసం ఏళ్ల తరబడి పోరాడుతూనే ఉన్నానని ఆమె తెలిపారు. “పురుషాధిక్య సమాజం (Society) లో నిందలేసి నువ్వు మద్దతు పొందగలవేమో కానీ, ఏదో ఒకరోజు నీకూ కష్టకాలం తప్పదు. చట్టంపై నాకు పూర్తి నమ్మకం ఉంది” అంటూ షమీని ఉద్దేశించి ఆమె ఘాటు వ్యాఖ్యలు చేశారు. మహమ్మద్ షమీ, హసీన్ జహాన్లకు 2014లో వివాహం కాగా, వీరికి ఒక కుమార్తె ఉంది. కొన్నాళ్లకే మనస్పర్థలు రావడంతో 2018 నుంచి విడిగా ఉంటున్నారు. హసీన్ జహాన్ ధాఖలు చేసిన గృహ హింస కేసుపై విచారణ కొనసాగుతోంది. ఈ క్రమంలోనే ఇటీవల ఆమెకు, వారి కుమార్తె సంరక్షణ కోసం భరణం చెల్లించాలంటూ కలకత్తా హైకోర్టు (Kolkata High Court) షమీని ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే హసీన్ జహాన్ తాజా పోస్ట్ చేసినట్లు తెలుస్తోంది.
Read hindi news: hindi.vaartha.com
Read Also: Mohammed Siraj: సిరాజ్ సూపర్ ‘సిక్స్’… ఇంగ్లండ్ ఆలౌట్