ఇంద్రకీలాద్రి (విజయవాడ): దుర్గమ్మవారి
Durgamma: ఆలయానికి సోలార్ పవర్ పనుల్లో పురోగతి పై ఇఓ వికె శీనా నాయక్ చర్యలు చేపట్టారు. గత జూన్ 25న సోలార్ ప్లాంట్ను సందర్శించి అక్కడ మిగులు విద్యుత్ కు సంబంధించిన మీటర్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. ఈ మేరకు శుక్రవారం నాడు రాష్ట్ర ఏపిసిపి డిసిఎల్ చైర్మన్ ఎండి పొగాకు పుల్లారెడ్డి (Chairman MD Pogaku Pullareddy) దుర్గమ్మవారి ఆలయానికి ఆయనకు వివరాలు తెలిపారు. దీంతో ఆయన వెంటనే స్పందించి నెట్ మీటర్ ల ఏర్పాటుకు తగిన చర్యలు తీసుకుంటామని ఇఓకు హామీ ఇచ్చారు. చాలాకాలంగా ఈ విషయంలో జరుగుతున్న జాప్యానికి ఇఓ చర్యలతో ఫుల్ స్టాప్ పడనుంది. దీంతో ఆలయానికి సోలార్ పవర్ (Solar power) ద్వారా ఆదాయం సమకూరే అవకాశముంది.

పొగాకు పుల్లారెడ్డి దుర్గమ్మవారిని దర్శించుకున్న సందర్భం
ఈ సందర్భంగా పొగాకు పుల్లారెడ్డి దుర్గమ్మ (Durgamma) వారిని దర్శించుకున్నారు. ఆయనకు ఇఓ దుర్గమ్మవారి చిత్రపటం, ప్రసాదం, శేషవస్త్రం అందించారు. వేదపండితులు వేదాశీర్వచనం పలికారు. దుర్గమ్మ వారికి పలువురు భక్తబృందాల వారు పెద్ద ఎత్తున తరలివచ్చి శుక్రవారం ఆషాడం సారెను సమర్పించారు. మేళతాళాలు, డప్పువాయిద్యాల నడుమ పలు ప్రాంతాలకు చెందిన బృందాలు తమ ఇంటి ఆడపడుచుగా భావించి దుర్గమ్మవారికి సారె సమర్పించారు. ఆషాడం సారె సమర్పించిన భక్తుల బృందాలకు దుర్గమ్మవారి దర్శనం ఏర్పాటు చేసిన అధికారులు అన్నప్రసాదాలు అందించారు. శుక్రవారం మధ్యాహ్న సమయంలో విఐపి దర్శనాల రద్దు చేశారు. దుర్గమ్మవారిని శుక్రవారం నేషనల్ ట్రైబల్ వెల్ఫేర్ కు చెందిన కేంద్ర అధికారుల బృందం, రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎం ఎం నాయక్ దర్శించుకున్నారు. వారికి దుర్గమ్మవారి దర్శనం ఏర్పాటు చేసి శ్రీ అమ్మవారి ప్రసాదం, శేషవస్త్రం, మెమొంటో అందించారు. వేదపండితులు వేదాశీర్వచనాలు పలికారు. శ్రీదుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం లో ఇఓ వికె శీనా నాయక్ పలు ప్రదేశాలను పరిశీలించారు. భక్తులతో స్వయంగా ముచ్చటించి వారికందుతున్న సౌకర్యాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఇఓ పొంగల్షద్దు, క్లోక్ూం, చెప్పులస్టాండ్, తాగునీటి సౌకర్యం పరిశీలించారు. మెరుగుఅయిన సౌకర్యాలపై భక్తులకు అధికారులకు సూచనలు, సలహాలు చేయడానికి వీలుగా ఏర్పాట్లు చేశారు.
Read hindi news: hindi.vaartha.com