ఇరాన్-ఇజ్రాయెల్(Iran-Israel) మధ్య ఉద్రిక్త పరిస్థితులు మరింతగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ఇరాన్ ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది ఇజ్రాయెల్. ఇరాన్లోని అరాక్ హెవీ వాటర్ రియాక్టర్ సమీప ప్రజలకు ఐడీఎఫ్(IDF) హెచ్చరికలు జారీ చేసింది. అక్కడి నుంచి ఖాళీ చేయాలని తెలిపింది. ఈ మేరకు ప్లాంట్ ఉపగ్రహ చిత్రాన్ని ఎక్స్లో పోస్ట్ చేసింది. అరాక్ హెవీ వాటర్ రియాక్టర్ టెహ్రాన్కు నైరుతి దిశలో 250 కిలోమీటర్లు (155 మైళ్ళు) దూరంలో ఉంది. హెవీ వాటర్ న్యూక్లియర్ రియాక్టర్ను చల్లపరచడానికి సహాయపడుతుంది. కానీ ఇది అణ్వాయుధాల్లో ఉపయోగించగల ప్లూటోనిమియను ఉత్పత్తి చేస్తుంది. ఇరాన్లోని అరాక్ హెవీ వాటర్ రియాక్టర్ సమీపంలో నివసిస్తున్న ప్రజలకు ఇజ్రాయెల్ IDF (ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్) హెచ్చరికలు జారీ చేసింది. ప్రజలను ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయాలని సూచించింది. ఈ ప్రాంతానికి సంబంధించిన ఉపగ్రహ చిత్రాన్ని సోషల్ మీడియా ప్లాట్ఫాం X (మునుపటి ట్విట్టర్)లో పోస్ట్ చేసింది.
అరాక్ రియాక్టర్ టెహ్రాన్కు 250 కి.మీ దూరంలో ఉంది. ఈ రియాక్టర్ ప్లూటోనియం ఉత్పత్తి చేయగల సామర్థ్యంతో ఉన్నది.

దాడుల్లో కనీసం 639 మంది మరణించారు
మరోవైపు ఇరాన్పై ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో కనీసం 639 మంది మరణించగా,1,329 మంది గాయపడినట్లు వాషింగ్టన్కు చెందిన హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్స్ సంస్థ(Human Rights Activity Organization)తెలిపింది. వారిలో 263 మంది సామాన్య ప్రజలు కాగా, 154 మంది భద్రతా సిబ్బంది గుర్తించినట్లు పేర్కొంది. ప్రతీకారంగా ఇరాన్ చేసిన దాడుల్లో ఇజ్రాయెల్లో 24 మంది మృతి చెందగా, వందలాది మంది గాయపడినట్లు చెప్పింది. అయితే, ఇరాన్ ప్రభుత్వం తెలిపిన గణాంకాల ప్రకారం 224మంది మృతి చెందగా, గాయపడిన వారి సంఖ్య 1,277గా పేర్కొంది.
శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నాము: ఇరాన్ దౌత్యవేత్త జావాద్ హెుస్సేనీ
మరోవైపు ఇరాన్లోని పలు ప్రాంతాలపై వరుస దాడులు చేస్తున్నట్లు ఇజ్రాయెల్ ప్రటిచింది. గురువారం టెహ్రాన్లోని 20పైగా సైనిక లక్ష్యాలపై దాడి చేసినట్లు ఇజ్రాయెల్ సైన్యం పేర్కొంది. వాటిల్లో యురేనియం సెంట్రిఫ్యూజ్లు, అణ్వాయుధ పరిశోధన, అభివృద్ధి కేంద్రాలు ఉన్నట్లు తెలిపింది. ఇదిలా ఉండగా ఇజ్రాయెల్-ఇరాన్ వివాదంపై రష్యా, చైనా, పాకిస్థాన్ అభ్యర్థన మేరకు యూన్ భద్రతా మండలి శుక్రవారం రెండో అత్యవసర సమావేశాన్ని నిర్వహించాలని నిర్ణయించింది. దీనికి మధ్యవర్తిత్వం వహించేందుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ముందుకొచ్చారు. ఇజ్రాయెల్ భద్రతా సమస్యలను తగ్గించుకుంటూ, టెహ్రాన్ శాంతియుత అణు కార్యక్రమాన్ని కొనసాగించడానికి అనుమతించే పరిష్కారాన్ని చర్చించడంలో రష్యా చేయగలదని సూచించారు. మరోవైపు తమ దేశాం శాంతి చర్చలకు సిద్ధంగా ఉందని భారత్లోని ఇరాన్ దౌత్యవేత్త జావాద్ హెుస్సేనీ అన్నారు. కానీ ముందుగా ఇజ్రాయెల్ సైనిక చర్యను ఖండించాలని పేర్కొన్నారు. విద్యార్థులతో సహా భారతీయ పౌరులను సురక్షితంగా తరలించేలా చూస్తామని అన్నారు.
Read Also: Donald Trump : నేనేం చేస్తానో తెలియదు: ఇరాన్పై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు