కాంతార చాప్టర్ 1: ప్రమాదాల పరంపరలో షూటింగ్!
కన్నడ నటుడు రిషబ్ శెట్టి (Rishabh) ప్రధాన పాత్రలో, దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ‘కాంతార చాప్టర్ 1’ ప్రస్తుతం దేశవ్యాప్తంగా సినీ అభిమానుల దృష్టిని ఆకర్షిస్తోంది. గతంలో సంచలన విజయం సాధించిన ‘కాంతార’ చిత్రానికి సీక్వెల్గా రూపొందుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే, ఈ అంచనాలతో పాటు, ఈ సినిమా షూటింగ్ సమయంలో జరుగుతున్న వరుస ప్రమాదాలు అందరినీ కలవరపెడుతున్నాయి. కొన్ని రోజులుగా వార్తలలో నిలుస్తున్న ఈ సినిమా, ఇప్పుడు విషాద ఛాయలు అలుముకుంటున్న సంఘటనలతో చర్చనీయాంశంగా మారింది.
తాజా పడవ ప్రమాదం: రిషబ్ శెట్టి త్రుటిలో సేఫ్!
మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ అయిన ‘కాంతార చాప్టర్ 1’ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. కర్ణాటకలోని శివమొగ్గ జిల్లాలోని హోసానగర్ సమీపంలో ఉన్న మణి రిజర్వాయర్ బ్యాక్వాటర్స్లో సినిమా చిత్రీకరణ జరుగుతుండగా, తాజాగా ఒక పెద్ద ప్రమాదం తప్పింది. శనివారం సాయంత్రం, 30 మందికి పైగా కళాకారులు ప్రయాణిస్తున్న ఒక పడవ మునిగిపోయింది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో స్వయంగా హీరో, దర్శకుడు రిషబ్ శెట్టి (Rishabh)కూడా ఆ పడవలో ఉండటం ఆందోళన కలిగించింది. పడవ మునిగిపోయిన వెంటనే, అందులో ఉన్నవారందరూ చాకచక్యంగా ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నారు. ఈ ఘటనలో ఎవరికీ పెద్దగా గాయాలు కానప్పటికీ, కెమెరాతో పాటు పలు విలువైన సాంకేతిక పరికరాలు నీటపాలైనట్లు తెలుస్తోంది. ప్రమాదం తర్వాత, కళాకారులందరూ హోసానగర్లోని యాదూర్ రిసార్ట్కు సురక్షితంగా తిరిగి వచ్చారు. అయితే, ఈ పడవ ప్రమాదం గురించి శివమొగ్గ పోలీసులకు ఎలాంటి అధికారిక సమాచారం అందలేదని తెలుస్తోంది. షూటింగ్ సమయంలో అసలు ఏం జరిగింది, పడవ మునిగిపోవడానికి గల కారణాలు ఏంటి అనే విషయాలపై స్పష్టత రావాల్సి ఉంది. చిత్రయూనిట్ కూడా ఈ ఘటనపై ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు.

మూడు విషాద మరణాలు: చిత్రయూనిట్ను వెంటాడుతున్న దురదృష్టం
‘కాంతార చాప్టర్ 1’ షూటింగ్ ప్రారంభమైనప్పటి నుండి వరుసగా ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. కేవలం ప్రమాదాలు మాత్రమే కాదు, ఈ సినిమాతో సంబంధం ఉన్న ముగ్గురు నటులు మరణించడం మరింత ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే, ఈ చిత్రంలో నటించిన నటుడు విజు వికే, తీర్థహళ్లిలోని అగుంబేలోని తన నివాసంలో గుండెపోటుతో మరణించారు. ఆ రోజు షూటింగ్ కోసం తీర్థహళ్లికి వచ్చిన విజు, షూటింగ్ ప్రారంభం కాసేపట్లో ఛాతిలో నొప్పి రావడంతో స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు.
ఇదిలా ఉండగా, గత ఏడాది నవంబర్లో జూనియర్ ఆర్టిస్టులు ప్రయాణిస్తున్న వ్యాన్కు ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత, మే నెలలో నటుడు కపిల్ ప్రమాదవశాత్తు నదిలో పడి చనిపోగా, అదే నెలలో మరొక నటుడు రాకేష్ పూజారి గుండెపోటుతో కన్నుమూశారు. వరుసగా జరుగుతున్న ఈ విషాద ఘటనలు ‘కాంతార చాప్టర్ 1’ చిత్రయూనిట్ను కలవరపెడుతున్నాయి. ఈ సినిమాపై నెలకొన్న అంచనాల మధ్య, ఈ వరుస ప్రమాదాలు సినిమా విడుదలపై ఎలాంటి ప్రభావం చూపుతాయో చూడాలి.
Read also: Yamudu: ‘యముడు’ మూవీ నుంచి ‘ధర్మో రక్షతి’ పాట రిలీజ్