వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2025లో ఆస్ట్రేలియా జట్టు దక్షిణాఫ్రికా చేతిలో పరాజయం పాలైంది. వరుసగా రెండోసారి డబ్ల్యూటీసీ (WTC) గదను ముద్దాడాలన్న కంగారూల ఆశలు ఆవిరయ్యాయి. ఈ ఓటమిపై ఆసీస్ జట్టు మాజీ ఆటగాళ్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా, మాజీ ఫాస్ట్ బౌలర్ మిచెల్ జాన్సన్, తమ జట్టు సభ్యుల తీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు.ఆస్ట్రేలియా ఓటమికి గల కారణాలను విశ్లేషిస్తూ, మిచెల్ జాన్సన్ ఆటగాళ్ల నిబద్ధతను ప్రశ్నించాడు.
ప్రధాన బౌలింగ్
కొందరు ఆటగాళ్లు జాతీయ జట్టు ప్రయోజనాల కంటే ఐపీఎల్ (IPL) కు ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చారని ఆయన ఘాటుగా ఆరోపించాడు. మిచెల్ స్టార్క్, జోష్ హేజిల్వుడ్, పాట్ కమిన్స్, నాథన్ లైయన్లతో కూడిన ఆసీస్ ప్రధాన బౌలింగ్ దళం (బిగ్ ఫోర్) ఈ కీలక మ్యాచ్లో పూర్తిగా విఫలమైందని జాన్సన్ విమర్శించాడు.ముఖ్యంగా, పేసర్ జోష్ హేజిల్వుడ్ వైఖరిపై జాన్సన్ తీవ్ర విమర్శలు చేశాడు.

ప్రారంభమైన
ఇటీవలి కాలంలో హేజిల్వుడ్ (Hazlewood) ఫిట్నెస్పై అనేక ఆందోళనలు వ్యక్తమయ్యాయి. అయినా, అతను జాతీయ జట్టు కంటే ఐపీఎల్కు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు. వాయిదా పడిన తర్వాత తిరిగి ప్రారంభమైన ఐపీఎల్ సీజన్ కోసం భారత్ వెళ్లాలన్న అతని నిర్ణయం నన్ను తీవ్ర ఆశ్చర్యానికి గురిచేసింది” అని జాన్సన్ పేర్కొన్నాడు. స్పిన్నర్ నాథన్ లైయన్ (Nathan Lyon) కూడా వికెట్లు తీయడంలో విఫలమయ్యాడని ఆయన విమర్శించారు.
Read Also: Kieron Pollard: విరాట్ కోహ్లీ రికార్డు బ్రేక్ చేసిన కీరన్ పొలార్డ్