బాలీవుడ్ నటుడు ఆమీర్ ఖాన్ నటించిన ‘సితారే జమీన్ పర్’ సినిమాపై ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ఛైర్పర్సన్, ప్రముఖ రచయిత్రి, రాజ్యసభ సభ్యురాలు సుధా మూర్తి(Sudha Murthy) ప్రశంసలు కురిపించింది.ఈ చిత్రం తన ఆలోచనలను మార్చేసిందని, ఇది తప్పకుండా చూడాల్సిన సినిమా అని ఆమె చెప్పుకోచ్చింది.బాలీవుడ్ మిస్టర్ ఫర్ఫెక్ట్ ఆమిర్ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘సితారే జమీన్ పర్’ (Sitaare Zameen Par). ‘సబ్ కా అప్న నార్మల్’ అనేది ఉపశీర్షిక. ఆర్ఎస్ ప్రసన్న దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో జెనీలియా కథానాయికగా నటిస్తున్నారు.
ప్రత్యేక ప్రీమియర్
ఆమిర్ఖాన్ ప్రొడక్షన్స్ బ్యానర్పై ఆమిర్ఖాన్, అపర్ణ పురోహిత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా జూన్ 20న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా పలువురు సినీ ప్రముఖలతో పాటు రాజకీయ నాయకుల కోసం ప్రత్యేక ప్రీమియర్(Special premiere)ను ప్రదర్శించారు మేకర్స్.ఈ ప్రీమియర్లో ప్రముఖ రచయిత్రి, రాజ్యసభ సభ్యురాలు సుధా మూర్తి కూడా పాల్గోంది. అయితే ఈ సినిమా చూసిన అనంతరం సుధా మూర్తి భావోద్వేగానికి గురైంది.
ఒక అనుభవం
సాధారణంగా సామాజిక అంశాలపై తన రచనలతో, పర్యటనలతో ప్రజలకు అద్భుతమైన సందేశాలు ఇచ్చే సుధా మూర్తి — ఈసారి సినిమాపై తన అభిప్రాయాన్ని వ్యక్తీకరించారు.ఈ సినిమా చూసిన తర్వాత సుధా మూర్తి తన అనుభవాలను పంచుకుంటూ, “ఈ సినిమా చూశాక నా కళ్లలో నీళ్లు తిరిగాయి. ఇది కేవలం ఒక సినిమా కాదు, మన ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చేసే ఒక అనుభవం. మానసిక వికలాంగులుగా బాధపడుతున్న పిల్లలను మనం ఎలా అర్థం చేసుకోవాలి, వారికి ఎలా మద్దతు ఇవ్వాలి అనే దానిపై ఈ చిత్రం అద్భుతమైన సందేశాన్ని ఇస్తుంది” అని అన్నారు. ప్రతి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు,సమాజంలోని ప్రతి ఒక్కరూ ఈ సినిమాను చూడాలని ఆమె విజ్ఞప్తి చేశారు.
Read Also: Deepika Padukone: తండ్రి ప్రోత్సహంతో.. బ్యాడ్మింటన్ స్కూల్ ప్రారంభించిన దీపికా