అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా తెలంగాణలోని మహిళా స్వయం సహాయక సంఘాలకు కేటాయించిన సోలార్ ప్లాంట్లు , పెట్రోల్ బంకులను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క(Seethakka) జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ఈ మేరకు సోమవారం (జూన్ 9) సచివాలయం నుంచి ఆమె కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.22 జిల్లాల్లో చేపట్టిన ఇందిరా మహిళాశక్తి భవనాల నిర్మాణం నవంబర్ నాటికి పూర్తిచేయాలన్నారు. ‘ఇందిరా మహిళాశక్తి ఒక ప్రతిష్టాత్మక పథకం. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే ఈ పథకం లక్ష్యం. ఈ లక్ష్యం నెరవేర్చడానికి కలెక్టర్లు కృషి చేయాలి. పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగం(Panchayat Raj Engineering Department) అధికారులతో సమన్వయం చేసుకుని ఇందిరా మహిళాశక్తి భవనాలను పూర్తిచేయాలి’ అని సీతక్క ఆదేశించారు.
వెయ్యి అంగన్వాడీ
మహిళా సంఘాలచే ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు యూనిఫాంలను కుట్టిస్తున్నామని, బడులు తెరిచే రోజున విద్యార్థులందరికీ వాటిని పంపిణీ చేస్తామని మంత్రి సీతక్క వెల్లడించారు. అంగన్వాడీ కేంద్రాలు ఈ నెల 11న తెరుచుకోనున్నందున కలెక్టర్లు వాటిని పరిశీలించాలని సూచించారు. కొత్తగా వెయ్యి అంగన్వాడీ భవనాలను(Anganwadi buildings) నిర్మించబోతున్నామని వాటికి స్థలాలను సేకరించాలని ఆదేశించారు. ‘బాలభరోసా’ పేరుతో కొత్త పథకాన్ని తీసుకొస్తున్నట్లు మంత్రి ప్రకటించారు.
చర్యలు తీసుకోవాలని
ఈ పథకం కింద ఐదేళ్ల లోపు చిన్నారులకు అన్ని రకాల వైద్య పరీక్షలు చేయిస్తామని,ఏవైనా శస్త్రచికిత్సలు అవసరమైతే ఉచితంగా చేయిస్తామని ఆమె తెలిపారు. అర్హులైన మహిళలందరూ ఎస్హెచ్జీ(SHG)ల్లో ఉండేలా చర్యలు తీసుకోవాలని మంత్రి కోరారు. దివ్యాంగులకు ధ్రువీకరణ పత్రాలు అందజేసేందుకు 38 ఆసుపత్రుల్లో పరీక్షలు నిర్వహిస్తున్నామని, సకాలంలో వారికి అవి అందేలా చూడాలని సూచించారు. ఈ చర్యలన్నీ మహిళా సాధికారత, గ్రామీణాభివృద్ధిని లక్ష్యంగా చేసుకుని చేపడుతున్నట్లు మంత్రి సీతక్క వెల్లడించారు.

వడ్డీకి రుణాలను
తెలంగాణ ప్రభుత్వం మహిళా సంక్షేమం, సాధికారతకు పెద్దపీట వేస్తోంది. పలు పథకాలు, కార్యక్రమాల ద్వారా మహిళల ఆర్థిక, సామాజిక, ఆరోగ్యపరమైన అభివృద్ధికి కృషి చేస్తోంది. SHGలకు బ్యాంకుల ద్వారా తక్కువ వడ్డీకి రుణాలను అందించి, స్వయం ఉపాధిని ప్రోత్సహిస్తోంది.
బంకులను కేటాయించి
మహిళా సంఘాలకు సోలార్ ప్లాంట్లు(Solar plants), పెట్రోల్ బంకులను కేటాయించి వారి ఆర్థిక స్వావలంబనకు తోడ్పడుతుంది. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేసే లక్ష్యంతో ఇందిరా మహిళాశక్తి పథకాన్ని ప్రవేశపెట్టారు. ఇవే కాకుండా మహాలక్ష్మి, గృహజ్యోతి, రూ.500కే సిలిండర్ వంటి పథకాలు అమలు చేస్తున్నారు.
Read Also: Telangana: టీజీ లో కొత్త మెనూ ఫుడ్..ఇక పై మాంసంతో పాటు గుడ్లు