Akhil Akkineni: టాలీవుడ్ యువ కథానాయకుడు Akhil Akkineni ఒక ఇంటివాడయ్యారు. తన ప్రియురాలు జైనాబ్ రవ్జీతో శుక్రవారం (జూన్ 2, 2025) హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియోస్లో అంగరంగ వైభవంగా జరిగిన వివాహ వేడుకలో ఏడడుగులు నడిచారు.
గత ఏడాది నవంబర్లో నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట, వివాహ బంధంతో ఒక్కటవడంతో తెలుగు సినీ పరిశ్రమతో పాటు అభిమానులు కూడా ఆనందోత్సాహాల్లో మునిగిపోయారు.
ఇటీవలి కాలంలో అత్యంత ఆసక్తికరంగా ఎదురుచూసిన సెలబ్రిటీ పెళ్లిలలో ఇది ఒకటిగా నిలిచింది. వేడుక సందర్భంగా రాజసం, సంప్రదాయం, గ్లామర్ అన్నీ కలిసి ఒకే వేదికపై కనిపించాయి.
సినీ ప్రముఖుల సందడి – అఖిల్, జైనాబ్కు ఆశీర్వాదాలు
ఈ వివాహ వేడుకకు సినీ పరిశ్రమకు చెందిన పలువురు దిగ్గజాలు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.
మెగాస్టార్ చిరంజీవి, ప్రముఖ దర్శకుడు ప్రశాంత్ నీల్, గ్లోబల్ స్టార్ రామ్చరణ్ దంపతులు, దగ్గుబాటి ఫ్యామిలీ ఈ కార్యక్రమానికి విచ్చేసి, వేడుకకు మరింత శోభను చేకూర్చారు.
అఖిల్ తండ్రి, అగ్ర నటుడు నాగార్జున అక్కినేని, తల్లి అమల వ్యక్తిగతంగా పలువురు ప్రముఖులను ఈ వేడుకకు ఆహ్వానించారు.
తెలుగు రాష్ట్రాల సీఎంలను కూడా నాగార్జున దంపతులు స్వయంగా కలిసి ఆహ్వానించడం గమనార్హం.
దీనివల్ల ఈ వివాహానికి సినిమా రంగంలోనే కాకుండా, సామాజికంగా కూడా ఎంతటి ప్రాధాన్యత ఉందో స్పష్టమవుతోంది.
జైనాబ్ రవ్జీ: కళా విలాసం కలగలిపిన జీవితంలోకి అఖిల్
వధువు జైనాబ్ రవ్జీ ప్రతిభావంతురాలైన ఆర్టిస్ట్, పర్ఫ్యూమర్. ఆమె సృష్టించే ఎక్స్ప్రెసివ్ అబ్స్ట్రాక్ట్ ఆర్ట్వర్క్కు మంచి పేరుంది. అలాగే, “ఒన్స్ అపాన్ ది స్కిన్” అనే పేరుతో ఆమె నడుపుతున్న ఫ్రాగ్రెన్స్ బ్లాగ్ కూడా ఎంతో ప్రాచుర్యం పొందింది.
హైదరాబాద్లో జన్మించిన జైనాబ్, ప్రస్తుతం ముంబైలో నివసిస్తున్నారు. ఆమె ఒక ప్రముఖ వ్యాపారవేత్తల కుటుంబానికి చెందినవారు.
అంతేకాకుండా ఎం.ఎఫ్. హుస్సేన్ దర్శకత్వం వహించిన “మీనాక్షి: ఏ టేల్ ఆఫ్ త్రీ సిటీస్” చిత్రంలో కూడా జైనాబ్ చిన్న పాత్రలో నటించారు.
అభిమానుల ఆనందం – గతనిష్చితార్థం నేపథ్యంగా ఆసక్తికర మార్పు
అఖిల్ గతంలో ఫ్యాషన్ డిజైనర్ శ్రియా భూపాల్తో నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. అయితే కొన్ని కారణాల వల్ల ఆ వివాహం జరుగకుండానే రద్దు అయింది.
అప్పటి నుంచే అఖిల్ జీవిత భాగస్వామి ఎవరు? అనే ప్రశ్న అభిమానుల మనసుల్లో ఉండేది. ఈ నేపథ్యంలో జైనాబ్తో ఆయన వివాహం జరగడం మరింత ఉత్కంఠకు కారణమైంది. నిశ్చితార్థం నుంచే ఈ జంట మీడియా దృష్టిని ఆకర్షించింది.
పెళ్లి వేడుక ప్రైవేట్గా నిర్వహించినప్పటికీ, దానికి సంబందించిన ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి.
జోధ్పూర్లో గ్రాండ్ రెసెప్షన్కు రంగం సిద్ధం
విశ్వసనీయ సమాచారం ప్రకారం, కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులతో హైదరాబాద్లో వివాహం నిర్వహించిన అనంతరం, జూన్ నెలాఖరులో రాజస్థాన్లోని జోధ్పూర్లో మరో అద్భుతమైన రెసెప్షన్ వేడుకను నిర్వహించనున్నారు.
బాలీవుడ్, టాలీవుడ్ సినీ ప్రముఖులతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న రాజకీయ, పారిశ్రామిక రంగానికి చెందిన అతిథులు ఈ గ్రాండ్ ఈవెంట్కు హాజరవ్వనున్నారు. ఇప్పటికే ఆ ఏర్పాట్లు ప్రారంభమయ్యాయని తెలిసింది. ఈ వేడుకలన్నింటిని దేశవ్యాప్తంగా మీడియా విస్తృతంగా కవర్ చేస్తోంది.
Read also: Balakrishna : రీ రిలీజ్ లో కొత్త పాటతో మళ్లీ వస్తున్న ‘లక్ష్మీ నరసింహ’ ఎపుడంటే ?