తెలంగాణలో ఈశాన్య రాష్ట్రాల వైపు తేమ వెళ్లిపోవడం వల్ల తెలంగాణలో వర్షాలు తగ్గముఖం పట్టాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. వాతావరణ శాఖ తాజా అంచనాల ప్రకారం రాష్ట్రంలో మరో నాలుగు నుండి ఐదు రోజుల పాటు తక్కువ వర్షాలు కురిసే అవకాశం ఉంది.ఈ సమయంలో రాష్ట్రవ్యాప్తంగా పొడి వాతావరణం, కొంత ఉక్కపోతతో కూడిన వాతావరణ పరిస్థితులు కొనసాగనున్నాయి.
అవకాశం ఉందని
వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు(Dharmaraju) వెల్లడించిన వివరాల ప్రకారం, ప్రస్తుతం ఉపరితల చక్రవాత ఆవర్తనం ఒకటి ఏర్పడింది. దాని ప్రభావంతో రేపటి నుంచే రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ వర్షాలు ప్రధానంగా మధ్య, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో పడే అవకాశం ఉందని ఆయన తెలిపారు. కొన్ని చోట్ల ఈదురుగాలులతో కూడిన వానలు కూడా నమోదు కావచ్చని చెప్పారు.ఈ వర్షాల ప్రభావం ఖమ్మం, నల్గొండ, మహబూబ్నగర్, వరంగల్, సూర్యాపేట, నాగర్కర్నూలు, జోగులాంబ గద్వాల్ వంటి జిల్లాల్లో కనిపించే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. కాగా, హైదరాబాద్ నగరంలో మాత్రం వర్షాలు విస్తృతంగా కురిసే అవకాశాలు తక్కువగా ఉన్నాయని తెలిపారు.

సర్దుబాటు చేసుకోవాలని
నాలుగైదు రోజుల తర్వాత పరిస్థితుల్లో మార్పు రావచ్చని వాతావరణశాఖ అంచనా వేస్తోంది. ఈ సమయంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటు కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ధర్మరాజు తెలిపారు. రైతులు ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని సాగు పనులు సర్దుబాటు చేసుకోవాలని సూచించారు.అంతేకాక, వాతావరణ మార్పులకు అనుగుణంగా ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మొత్తానికి తాత్కాలికంగా వర్షాలు తగ్గుముఖం పట్టినప్పటికీ, కొన్ని రోజుల తర్వాత వర్షాలు తిరిగి పుంజుకునే అవకాశాలు ఉన్నాయని స్పష్టమవుతోంది.ఈ వాతావరణ మార్పులతో రైతులు,ప్రజలు ప్రభావితమవుతున్న నేపథ్యంలో తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
Read Also: AP DSC ,TG TET: ఒకే తేదీల్లో ఏపీ డీఎస్సీ, తెలంగాణ టెట్ అయోమయంలో అభ్యర్థులు