రష్యా, ఉక్రెయిన్(Russia, Ukraine) మధ్య మూడేళ్లకు పైగా కొనసాగుతోన్న యుద్ధంలో శాంతి చర్చలకు ముందు మాస్కో(Masco)పై కీవ్జ(Kve)రిపిన డ్రోన్ దాడితో ఒక్కసారిగా ప్రపంచం ఉలిక్కిపడింది. ‘ఆపరేషన్ స్పైడర్ వెబ్’పేరుతో రష్యా భూభాగంలోకి 4,500 కిలోమీటర్ల మేర చొచ్చుకెళ్లి ఉక్రెయిన్ సైన్యం చావుదెబ్బ తీసింది. ఈ దాడి చరిత్ర పుటల్లో నిలిచిపోతుందని ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొడిమిర్ జెలెన్స్కీ ప్రకటించడం గమనార్హం. తక్కువ ఖర్చుతో తయారైన డ్రోన్లను (FPV drones) రష్యా భూభాగంలోకి రహస్యంగా ట్రక్కుల్లో తరలించి.. మాస్కో వైమానిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేశారు. ఏం జరుగుతుందో రష్యా సైన్యం తెలుసుకునేలోపు డ్రోన్లు విరుచుకుపడ్డాయి. ఇందుకు సంబంధించిన ఏఐ వీడియో ప్రస్తుత సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఏడాదిన్నర నుంచే గూఢచారి ఆపరేషన్ కోసం వ్యూహరచన
ఉక్రెయిన్ భద్రతా దళాలు (SBU) ఈ గూఢచారి ఆపరేషన్ కోసం కనీసం ఏడాదిన్నర నుంచే వ్యూహరచన చేయడం గమనార్హం. చాలా నెలల పాటు రష్యా గూఢచార కార్యాలయాలపై రెక్కి నిర్వహించి, స్థానిక పరిస్థితులను గురించి నిరంతరం సమాచారం సేకరించారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన చెక్కపెట్టలో 117 డ్రోన్లను అమర్చి ట్రక్కుల్లో తరలించారు. ప్రతి డ్రోన్లోనూ రహస్య కెమెరాలు, పేలుడు పేలుడు పదార్థాలను అమర్చారు.
రష్యా భద్రతా బలగాల దృష్టిని మరల్చి డ్రోన్లలు ఎగురవేశారు
సాధారణంగా డ్రోన్లను సుమారు 10–15 కిలోమీటర్ల దూరం నుంచి రిమోట్ ద్వారా ఆపరేట్ చేయొచ్చు. కానీ వీటికి టైమర్ అమర్చి.. తమంటతాముగా ఎగిరేలా ఏర్పాట్లు చేశారు. ఎస్బీయూ ఆపరేషన్లో భాగంగా, సెమీ-ట్రైలర్లను రష్యా సరిహద్దును దాటే ప్రాంతాల్లోకి పంపి, ఆ ప్రాంతాలపై అవగాహన ఉన్న డ్రైవర్ల బృందాన్ని నియమించారు.
ట్రక్కులు నియంత్రిత రహదారుల ద్వారా సెక్యూరిటీ చెక్ పాయింట్లకు దొరక్కుండా సరిహద్దుల నుంచి సుమారు 4,500 కిలోమీటర్ల దూరంలోని బెలయాలో ఇరుక్కుట్స్ వైమానిక స్థావరానికి చేర్చారు. డ్రోన్లు దాచిపెట్టిన చెక్క పెట్టెల మూతలు రిమోట్ సాయంతో తెరుకునే ఏర్పాట్లు చేశారు. అదే సమయంలో రష్యా భద్రతా బలగాల దృష్టిని మరల్చి డ్రోన్లలు ఎగురవేశారు. నిర్దేశిత లక్ష్యాలపై ఖర్చితమైన దాడులు చేసి.. రష్యాకు చెందిన Tu-95, Tu-22M, A-50 బాంబర్ విమానాలను ధ్వంస చేశారు.
40కి పైగా బాంబర్ యుద్ధ విమానాలు అగ్నికి ఆహుతి
ఒకే కొన్ని గంటల్లో 40కి పైగా బాంబర్ యుద్ధ విమానాలు అగ్నికి ఆహుతయ్యాయి. ముఖ్యంగా ఇరుట్స్క్ ఎయిర్బేస్లోని Tupolev Tu-22M సూపర్సోనిక్ దీర్ఘ శ్రేణి స్ట్రాటజిక్ బాంబర్లు, A-50 వాయుసేనా సమన్వయ విమానాలు, Tu-95 ఎంఎస్ బాంబర్ల దెబ్బతాయి. ఆయుధ సామర్ధ్యం దెబ్బతినడంతో ఉక్రెయిన్పై మరింత తీవ్రమైన రాకెట్/క్రూయిజ్ మిస్సైల్తో రష్యా దాడులు జరిపే అవకాశం కొంతమేర తగ్గిపోయే అవకాశం ఉంది.