గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్మన్ గిల్ తనపై వస్తున్న పుకార్లపై క్లారిటీ ఇచ్చాడు. హార్దిక్ పాండ్యా(Hardik Pandya)తో విభేదాలున్నాయని సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వార్తలపై గిల్ స్పందిస్తూ, తనకు హార్దిక్తో ఎలాంటి సమస్యలూ లేవని స్పష్టం చేశాడు. “సోషల్ మీడియాలో చూసిన ప్రతీ విషయం నిజం కాదు. దయచేసి అసత్య వార్తల్ని నమ్మొద్దు” అంటూ అభిమానులకు విజ్ఞప్తి చేశాడు.
పట్టించుకోకుండా
కాగా, ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా ముంబై ఇండియన్స్తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ 20 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.ఈ మ్యాచ్ సందర్భంగా శుభ్మన్ గిల్, హార్దిక్ పాండ్యా ఒకరినొకరు చూసుకోకపోవడం, విష్ చేసుకోకపోవడం చర్చనీయాంశమైంది. టాస్ సందర్భంగా ఈ ఇద్దరూ షేక్ హ్యాండ్ ఇచ్చుకోలేదని, ఇద్దరి మధ్య విభేదాలు ఉన్నాయంటూ సోషల్ మీడియా(Social media)లో జోరుగా ప్రచారం జరిగింది. హార్దిక్ పాండ్యా షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు ప్రయత్నించినా గిల్ పట్టించుకోకుండా పక్కకు వెళ్లిపోయాడని, ఆ తర్వాత గిల్ ఔటైనప్పుడు హార్దిక్ దూకుడుగా సెలబ్రేట్ చేసుకున్నాడని నెటిజన్లు కామెంట్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలను కూడా వైరల్ చేశారు. దాంతో ఈ ఇద్దరి మధ్య విభేదాలు ఉన్నాయని చాలా మంది భావించారు.

అనుబంధం
టీమిండియా కెప్టెన్సీ విషయంలో ఇద్దరి ఇగో క్లాష్ మొదలైందని చాలా మంది అనుకున్నారు. అయితే, ఈ ప్రచారంపై శుభ్మన్ గిల్ స్పందించాడు. హార్దిక్ పాండ్యాతో మంచి అనుబంధం, ప్రేమ మాత్రమే ఉన్నాయని స్పష్టం చేశాడు.ఇంటర్నెట్లో చూసే ప్రతీది నమ్మవద్దు’ అభిమానులను కోరాడు.రోహిత్ శర్మ(Rohit Sharma) వారసుడిగా శుభ్మన్ గిల్కు టీమిండియా టెస్ట్ టీమ్ సారథ్య బాధ్యతలు అప్పగించిన విషయం తెలిసిందే. ఇంగ్లండ్ పర్యటనతో శుభ్మన్ గిల్ కెప్టెన్సీ బాధ్యతలను స్వీకరించనున్నాడు. ఐపీఎల్ 2025 సీజన్లో అసాధారణ ప్రదర్శన కనబర్చిన గుజరాత్ టైటాన్స్ కీలక ఎలిమినేటర్లో ఓటమిపాలైంది. ఆఖరి వరకు పోరాడినా గుజరాత్కు విజయం దక్కలేదు.
Read Also: Singapore Open 2025: సింగపూర్ ఓపెన్లో సాత్విక్ జోడీ ఓటమి