అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(America President Donald Trump) ప్రస్తుతం అనుసరిస్తున్న తీరుపై ప్రపంచ దేశాలు అసహనం వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా భారత్(India) పై ట్రంప్(Trump) పగబట్టినట్లు కనిపిస్తోంది. ఇందుకు గత కొన్ని రోజులుగా ఆయన వ్యవహరిస్తున్న తీరే సాక్ష్యం. అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్న భారత్ లాంటి దేశాలకు సహకారం అందించాల్సింది పోయి ప్రపంచ దేశాల ముందు భారత్ ను కావాలనే తక్కువ చేసి మాట్లాడటం.. పాకిస్థాన్(Pakistan) లాంటి ఉగ్ర దేశంతో పోల్చడం ఇటు భారతీయులకు అటు ప్రపంచ దేశాలకు మింగుడు పడటం లేదు.

భారత్ కు ప్రపంచ దేశాలు సానుభూతి
పహల్గాం ఉగ్రదాడితో ఉలిక్కి పడ్డ భారత్ కు ప్రపంచ దేశాలు సానుభూతి తెలిపాయి. ఉగ్రవాదాన్ని అణచివేయాలని పిలుపునిచ్చాయి. పాకిస్థాన్ వైఖరిని తీవ్రంగా ఖండించాయి. కానీ పెద్దన్నగా చెప్పుకునే ట్రంప్ మాత్రం ఆశించినంత స్థాయిలో స్పందించలేదు. కానీ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ మొదలైనప్పటి నుంచే భారత్- పాక్ చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని శ్వేతసౌథం నుంచి ప్రకటనలు వెలువడటం గమనార్హం.
పాకిస్థాన్ లాంటి ఉగ్రదేశంతో భారత్ ను పోల్చడం
అంతేకాక భారత్- పాకిస్థాన్ మధ్య మధ్యవర్తిత్వం చేసి యుద్ధం ఆపేశానని.. యుద్ధం ఆగిపోవడానికి తానే కారణం అని చెప్పుకొచ్చారు ట్రంప్. గల్ఫ్ దేశాల్లో ఇటీవల పర్యటించిన ట్రంప్ అక్కడ కూడా ఇదే పాట పాడారు. అంతేకాక ప్రపంచ దేశాల ముందు భారత్ ను తక్కువ చేసి మాట్లాడారు. తనకు భారత్- పాకిస్థాన్ రెండూ మిత్ర దేశాలనీ..ఇరు దేశాలతో సత్సంబంధాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు. దీంతో పాకిస్థాన్ లాంటి ఉగ్రదేశంతో భారత్ ను పోల్చడం ఏంటని యావత్ భారతావని నుంచి విమర్శలు వెల్లువెత్తాయి.
Read Also: Gold Discovery : రైతు పొలంలో అనూహ్యంగా బయటపడ్డ భారీ బంగారు