భారత్, పాకిస్థాన్ (India-Pak) నేను చెబితేనే యుద్ధం ఆపేశాయంటూ క్రెడిట్ కోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఆపసోపాలు పడుతున్నారు. ఇప్పటికే పలుమార్లు ఈ అంశంపై స్పందించిన ట్రంప్ తాజాగా మరోసారి భారత్, పాక్ కాల్పుల విరమణపై మాట్లాడారు. ఖతార్లోని ఒక స్థావరంలో ఉన్న అమెరికన్ సైనికులతో ట్రంప్ మాట్లాడుతూ.. “గత వారం భారత్, పాకిస్తాన్ (India-Pak) మధ్య సమస్యను పరిష్కరించడానికి తాను కచ్చితంగా సహాయం చేశానని, మరింత ఎక్కువయ్యే ప్రతికూల పరిస్థితిని తాను పరిష్కరించాను. అయితే మొత్తం నేనే చేశానని చెప్పదలచుకోలేదు… కానీ గత వారం భారత్, పాకిస్తాన్ మధ్య సమస్యను పరిష్కరించడానికి నేను కచ్చితంగా సహాయం చేశాను, ఇది మరింత శత్రుత్వంగా మారుతుండగా, అకస్మాత్తుగా మీరు వేరే రకం క్షిపణులను చూడాల్సి వచ్చేది, కానీ, మేం దాన్ని పరిష్కరించాం” అని ట్రంప్ (Donald Trump) అన్నారు. భారత్ – పాకిస్థాన్ (India-Pak) మధ్య నెలకొన్న ఉద్రిక్తతను నేను స్వయంగా పరిష్కరించాను. అది పెద్ద యుద్ధంగా మారబోతుండగా, నేను జోక్యం చేసుకొని పరిష్కరించాను.” అయితే ట్రంప్ తన చరిత్రాపూర్వక వ్యాఖ్యలో, “నేనే అన్నిటిని చేశాను అనటం లేదు… కానీ నేను స్పష్టంగా కల్పించిన సహాయం వల్లే కాల్పుల విరమణ సాధ్యమైంది” అన్నారు.

యుద్ధ భయాన్ని నివారించాను
అమెరికా రెండు దేశాలతో వాణిజ్యాన్ని పెంచే అవకాశం ఉండటం వల్ల కాల్పుల విరమణ సులభతరం అయిందని కూడా ఆయన పేర్కొన్నారు. వారితో వాణిజ్యం గురించి మాట్లాడాం, యుద్ధానికి బదులుగా వాణిజ్యం చేద్దాం అని నేను ఇరు దేశాలతో చెప్పాను, దాంతో ఇరు దేశాలు సంతోషంగా కాల్పుల విరమణకు ఒప్పుకున్నాయని ట్రంప్ వెల్లడించారు. అప్పటి కాల్పుల విరమణ (Ceasefire) భారత్ – పాక్ మధ్య కీలక ఆమోదం తర్వాత ఏర్పడింది. అయితే, అమెరికా ద్వారా మౌన మద్దతు, చర్చలు జరిగాయని అప్పటి విశ్లేషణలు ఉన్నాయి. కానీ ట్రంప్ “నాకు తప్ప ఇంకెవ్వరూ చేయలేరు” అనే ధోరణి కొంత అతిశయోక్తిగా ఉందని నిపుణుల అభిప్రాయంభారత్, పాక్ దాదాపు వెయ్యి సంవత్సరాలుగా పోరాడుతున్నాయి. ఈ సమస్యను తాను పరిష్కగలనని నమ్మానని, అలాగే పరిష్కరించానంటూ పేర్కొన్నారు.
Read Also: Operation sindoor: భారత్కు ఆపరేషన్ సిందూర్తో వేల కోట్ల లాభం! ఎలాగంటే..?